పార్లమెంట్ ఉభయ సభలు గురువారం నాడు  నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరిగిన విషయం తెలిసిందే. 


న్యూఢిల్లీ: Parliamentఉభయ సభలు గురువారం నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరిగాయి. ఇవాళ Loksabha, రాజ్యసభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

పార్లమెంట్ Budget 2022 సమావేశాలు ఈ ఏడాది జనవరి 31న ప్రారభం అయ్యాయి. తొలి రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో పార్లమెంట్ ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో షిఫ్టుల వారీగా పని చేశాయి.మరోవైపు గత ఏడాది మాదిరిగానే ఈ సారీ పేపర్​లెస్​ బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం.

రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. మొదటి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు నిర్వహించారు.రెండో దశ బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్​ 8 వరకు నిర్వహించారు. 

తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి Ramnath Kovind ప్రసంగించారు.ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు.

గత ఏడాది బడ్జెట్​ సమయంలో పెట్టుకున్న లక్ష్యాలు, సాధించిన విజయాలతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆంచనాలతో కూడుకున్నదే ఆర్థిక సర్వే. ఈ సర్వేను ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అధ్యక్షతన ఆర్థిక నిపుణులతో కూడిన బృందం తయారు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్ 2022 ను ప్రవేశ పెట్టారు.

 ఫిబ్రవరి రెండవ తేదీన నుంచి ఉభయ సభలు వేర్వేరు సమాల్లో భేటీ కానున్నాయి. ఒక్కో సభ రోజుకు 5 గంటల చొప్పున మాత్రమే పని చేసింది.పార్లమెంట్​ సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం, ప్రస్తుతం దేశంలో భారీగా కొవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది పార్లమెంట్ వ్యవహారాల విభాగం.మొదట షిఫ్టులో రాజ్య సభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అయింది.ఆ తర్వాత రెండో షిఫ్టులో సాయంత్రం 4 గంటల నంచి రాత్రి 9 గంటల వరకు లోక్​ సభ సమావేశాలు నిర్వహించారు.