జమ్మూ కాశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రహదారిని మూసివేశారు. శిథిలాలను తొలగించిన తరువాత రోడ్డును తెరుస్తామని అధికారులు తెలిపారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో మంగళవారం కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేసినట్టు అధికారులు తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అస్గర్ మాలిక్ మాట్లాడుతూ.. బనిహాల్ సమీపంలోని షేర్ బీబీ వద్ద తెల్లవారుజామున 2 గంటలకు కొండచరియలు విరిగిపడ్డాయని చెప్పారు. దీంతో కాశ్మీర్ వైపు వెళ్తున్న ట్రక్కులు మార్గమధ్యంలో చిక్కుకుపోయాయని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
Scroll to load tweet…

అయితే శిథిలాలలో చాలా భాగాన్ని ఇప్పటికే తొలగించినట్లు అస్గర్ మాలిక్ తెలిపారు. రాళ్లు కింద పడటం ఆగిపోయిన తర్వాత, మిగిలిన రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ ఉదయం నుంచి శ్రీనగర్ వైపు వచ్చే వాహనాలను అనుమతించడం లేదని తెలిపారు.

Scroll to load tweet…

అదే సమయంలో, జమ్మూలోని ట్రాఫిక్ విభాగానికి చెందిన అధికారి ఒకరు మాట్లాడుతూ, మేము ఉదయం తేలికపాటి మోటారు వాహనాలను అనుమతించాము, అయితే నిరంతరం రాళ్లు పడిపోతున్నట్లు సమాచారం అందడంతో ప్రస్తుతానికి ట్రాఫిక్ నిలిపివేసారు. ఈ ఘటనపై జమ్మూలోని ఓ ట్రాఫిక్ విభాగం అధికారి మాట్లాడుతూ.. ‘‘మేము ఉదయం తేలికపాటి మోటారు వాహనాలను అనుమతించాం. కానీ నిరంతరం రాళ్లు రోడ్డుపై వచ్చి పడుతున్నాయనే సమాచారం అందడంతో ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశాం’’ అని చెప్పారు.