తాను ఇంత వరకు ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. కానీ విశ్వవిద్యాలయాల పని తీరులో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు కలుగజేసుకుందని చెప్పారు. 

పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మంగళవారం మరో సారి విమర్శలు గుప్పించారు. తాను ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు నిరూపిస్తే గవర్నర్ పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అయితే విశ్వవిద్యాలయాల పనితీరులో రాష్ట్ర ప్రభుత్వం రోజువారీగా జోక్యం చేసుకుంటోందని తాను 1,001 ఉదాహరణలను చెబుతానని తెలిపారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎయిరిండియాకు షాకిచ్చిన అమెరికా.. దాదాపు 1000 కోట్ల చెల్లించాలని ఆదేశం .. ఇంతకీ ఏం జరిగిందంటే?

గవర్నర్, కేరళ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదం పై ప్రశ్నించినప్పుడు ‘‘గతేడాది వరకు కేరళలో 13 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, అన్ని నియామకాలు చట్టవిరుద్దమని మీరు ఎందుకు లేవనెత్తడం లేదు. ? చట్టాన్ని ఉల్లంఘించి 100 శాతం నియామకాలు జరిగిన రాష్ట్రం మరే రాష్ట్రంలోనైనా ఉందా? ’’అని ఆయన అన్నారు. విశ్వవిద్యాలయాలు పార్టీ క్యాడర్ కు, వారి బంధువులకు ద్రోహులుగా మారాయని ఆయన తెలిపారని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

తెలివి ప్రదర్శిస్తున్నారా ?... మోర్బీ విషాదం మీద గుజరాత్ హైకోర్టు సీరియస్...

విశ్వవిద్యాలయాలను నడపాల్సిన పని ఛాన్సలర్‌దేనని, ప్రభుత్వాన్ని నడపడం ఎన్నికైన ప్రభుత్వ పని అని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అని అన్నారు. ‘‘ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి నేను ప్రయత్నించిన ఒక ఉదాహరణను నాకు ఇవ్వండి. ఆ క్షణంలోనే నేను రాజీనామా చేస్తాను. విశ్వవిద్యాలయాల పనితీరులో ప్రతిరోజూ జోక్యం చేసుకున్న 1001 ఉదాహరణలను నేను అందిస్తాను’’ అని ఆయన అన్నారు. 

ఈసారి గుజరాత్ సీఎం ఆయనే ... అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

తాను ఒత్తిడి చేసే వ్యక్తి కాదని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అన్నారు. ఫిషరీస్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూనివర్శిటీల ఛాన్సలర్‌గా కేరళ గవర్నర్‌ను తొలగించాలని సీపీఐ(ఎం) ప్రభుత్వం తీర్మానం చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.