Kerala Governor Arif Mohammed Khan: కేరళలోని ప్రఖ్యాత గురువాయూర్ ఆలయంలో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తులాభారం (దేవుడికి నైవేద్యంగా సమర్పించడం) సమర్పించుకున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన 'కడలి' అని పిలువబడే అరటి రకంతో తులాభారం జ‌రిగింది. మాదంప్ కుంజుకుట్టన్ స్మారకార్థం గవర్నర్ గురువాయూర్ లో పర్యటిస్తున్నారు. 

Arif Mohammed Khan-Thulabharam: కేరళలోని ప్రఖ్యాత గురువాయూర్ ఆలయంలో రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తులాభారం (దేవుడికి నైవేద్యంగా నిలువెత్తు బరువును సమర్పించడం) సమర్పించనున్నారు. శ్రీకృష్ణుడికి ఇష్టమైన 'కడలి' అని పిలువబడే అరటి రకంతో తులాభారం జ‌రిగింది. మాదంప్ కుంజుకుట్టన్ స్మారకార్థం గవర్నర్ గురువాయూర్ లో పర్యటిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివ‌రాల్లోకెళ్తే.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గురువాయూర్ ఆలయాన్ని సందర్శించి తులాభారం నిర్వహించారు. సాయంత్రం ఆలయ తూర్పు నాద మండపంలో గవర్నర్ కు 83 కిలోల కడలి పండును అందజేశారు. ఇందుకోసం ఆలయంలో రూ.4250 చెల్లించారు. గురువాయూర్ లో మాదంప్ కుంజుకుట్టన్ ఫ్రెండ్ షిప్ కమిటీ ఏర్పాటు చేసిన మాదంప్ సంస్మరణ సభను ప్రారంభించడానికి గవర్నర్ వచ్చారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆలయం ముందు వచ్చారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న‌ తెల్ల చొక్కా, ధోతీ ధరించి ఉన్నారు. 

ఆల‌య గోపురం గేటు ముందు ఉన్న గురువాయూరప్పన్ ను గవర్నర్ తాకారు. గోపురంలో కొన్ని నిమిషాలు చేతులు జోడించి మొక్కుతూ నిలబడ్డారు. గవర్నర్ ఆ తర్వాత తూర్పు ద్వారం వద్దకు వెళ్లి తులాభారం నిర్వహించారు. తులాభారం తయారీకి 83 కిలోల కడలి పండు పట్టింది. గురువాయూరప్పన్ ప్రసాద కిట్ ను గవర్నర్ కు దేవస్థానం చైర్మన్ డా. వీకే విజయన్ అందజేశారు. గురువాయూర్ ఆలయ సందర్శనపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఒక్క వాక్యంలో స్పందిస్తూ ఇది మాటల్లో వర్ణించలేని ఆధ్యాత్మిక అనుభవం అన్నారు. దీనికి ప్రతిస్పందన ఉపనిషత్తు శ్లోకాన్ని పఠించడం ద్వారా వచ్చింది. తులాభారం అనంతరం దేవస్థానం పాలకమండలి సభ్యులతో ఫొటోలు దిగారు.

దేవదాయశాఖ చైర్మన్, పాలకమండలి సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం గవర్నర్ అక్క‌డి నుంచి వెనుదిరిగారు. మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీవల్సం అతిథి గృహానికి చేరుకున్న గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు దేవస్థానం చైర్మన్ డాక్టర్ వీకే విజయన్, పాలకమండలి సభ్యులు సీ మనోజ్, వీజీ రవీంద్రన్, అడ్మినిస్ట్రేటర్ కేపీ వినయన్ స్వాగతం పలికారు. గవర్నర్ కు చైర్మన్ పూలమాలలు వేసి స‌త్క‌రించారు. చిత్రపటాన్ని దేవస్థానానికి కానుకగా ఇచ్చారు. జిల్లా యంత్రాంగం తరఫున చావక్కాడ్ తహసీల్దార్ ఎంకే ఇందు గవర్నర్ కు స్వాగతం పలికేందుకు వచ్చారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పి.మనోజ్ కుమార్, పీఆర్వో విమల్, గెస్ట్ హౌస్ మేనేజర్ బిను పాల్గొన్నారు.