కాంగ్రెస్ కు కేజీఎఫ్ కష్టాలు.. రాహుల్ గాంధీతో పాటు మరికొందరికి కర్ణాటక హైకోర్టు నోటీసు
కాంగ్రెస్ పార్టీ కాపీరైట్స్ ను ఉల్లంఘించిందని పేర్కొంటూ బెంగళూరుకు చెందిన మ్యూజిక్ లేబుల్ MRT మ్యూజిక్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్పై కర్ణాటక హైకోర్టు రాహుల్ గాంధీ, జైరామ్ రమేష్, సుప్రియా శ్రీనాట్లకు నోటీసులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు హైకోర్టు ఆదేశాలను పాటించలేదని కంపెనీ తన పిటిషన్లో పేర్కొంది. చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ అశోక్ ఎస్ కినాగిలతో కూడిన డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.
కాంగ్రెస్ కు కేజీఎఫ్ పాట కష్టాలు వచ్చాయి. భారత్ జోడో యాత్ర వీడియోలో కేజీఎఫ్ సినిమాలోని పాటను వాడుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతేలకు కర్ణాటక హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ వీడియోను కర్ణాటక హెచ్సి ఆదేశించినప్పటికీ తొలగించలేదని, ఫలితంగా కాపీరైట్ ఉల్లంఘన, కోర్టు ధిక్కారం జరిగిందని ఆరోపించబడింది.ఈ నేపథ్యంలో ఎంఆర్టీ మ్యూజిక్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది.
కాపీరైట్ను ఉల్లంఘిస్తూ.. కాంగ్రెస్,భారత్ జోడో యాత్ర సోషల్ మీడియా హ్యాండిల్స్లో అప్లోడ్ చేసిన వీడియోను తొలగించలేదని MRT మ్యూజిక్ పేర్కొంది. రాహుల్ గాంధీ, ఇతర నేతలు హైకోర్టు ఆదేశాలను పాటించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. విచారణ అనంతరం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రసన్న బి. వరాలే, జస్టిస్ అశోక్ ఎస్. కినాగిలతో కూడిన ఉమ్మడి ధర్మాసనం నోటీసులు జారీ చేసి కాంగ్రెస్ నేతల నుంచి సమన్లు జారీ చేసింది. సివిల్ కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయించింది
సివిల్ కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్
అంతకుముందు నవంబర్ 8న కర్ణాటక హైకోర్టు కాంగ్రెస్కు పెద్ద ఊరటనిచ్చింది. విచారణ అనంతరం.. కాంగ్రెస్, భారత్ జోడో యాత్రల ట్విట్టర్ హ్యాండిల్స్ను బ్లాక్ చేయాలన్న సివిల్ కోర్టు ఆదేశాలను కర్ణాటక హైకోర్టు పక్కన పెట్టింది. భారత్ జోడో యాత్ర కోసం రూపొందించిన వీడియోలలో కేజీఎఫ్-2లోని పాటలను కాంగ్రెస్ ఉపయోగించుకుందని ఆరోపించారు. 45 సెకన్ల క్లిప్ ఉన్నందున కాంగ్రెస్, భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్ను బ్లాక్ చేయరాదని కాంగ్రెస్ హైకోర్టులో వాదించింది. ఈ క్రమంలో..కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల నుండి కాపీరైట్ చేయబడిన అన్ని విషయాలను 24 గంటల్లోగా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.
అసలు విషయం ఏమిటి?
భారత్ జోడో యాత్రను ప్రచారం చేయడానికి కాంగ్రెస్ MRT మ్యూజిక్ ( కేజీఎఫ్ 2)పాటలను ఉపయోగించింది. MRT మ్యూజిక్ కన్నడ, హిందీ, తెలుగు మరియు తమిళం మొదలైన భాషల్లో 20,000 కంటే ఎక్కువ పాటల సంగీత హక్కులను కలిగి ఉంది. KGF 2 మ్యూజిక్ రైట్స్ని సొంతం చేసుకోవడానికి కంపెనీ భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టింది. అడగకుండానే తమ సంగీతాన్ని కాంగ్రెస్ తన రాజకీయ కార్యక్రమానికి ఉపయోగించుకుందని MRT మ్యూజిక్ ఆరోపించింది. కేజీఎఫ్ 2లోని పాటను ఉపయోగించిన వీడియోలో రాహుల్ గాంధీ కూడా కనిపిస్తారు.
KGF నిర్మాతలు ఏమి ఆరోపించారు?
జాతీయ రాజకీయ పార్టీ .. చట్టవిరుద్ధమైన చర్య పాల్పడిందనీ,ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థల హక్కులను విస్మరించిందని, అయితే ఈ దేశాన్ని పరిపాలించడానికి అవకాశం కోసం ఈ భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదుదారు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సెక్షన్ 403, 465, 34, సెక్షన్లలతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 66, కాపీరైట్ చట్టం 1957లోని సెక్షన్ 63 కింద కేసు నమోదు చేయబడింది.