Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం.. హుక్కా బార్లను నిషేధం.. వాటిపై కూడా.. 

హుక్కా బార్‌లను నిషేధించడంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. పొగాకు కొనుగోలుకు చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Karnataka government planning to ban hookah bars, raise age for smoking KRJ
Author
First Published Sep 20, 2023, 6:23 AM IST

కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. యువతపై పొగాకు కలిగే హానికరమైన ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం హుక్కా బార్‌లను నిషేధించాలని ఆలోచిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. 12 ఏళ్ల పిల్లల నుంచి 25 ఏళ్ల యువకుల వరకు హుక్కా బార్లకు వెళ్తున్నారని అన్నారు.

ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. దీంతో హుక్కా బార్‌లను నిషేధించడంతోపాటు పొగాకు వినియోగించే చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి ప్రకటించారు. 

పొగాకు కొనుగోలుకు చట్టబద్ధమైన వయస్సును 18 నుంచి 21కి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వరకు యువకులు హుక్కా బార్లను సందర్శిస్తున్నారని, ఈ పొగాకు వినియోగాన్ని అరికట్టాలని, అందుకోసం చట్టం తేవాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కోరారు.  వ్యసనానికి దారితీసే హుక్కాలో ఉపయోగించే తెలియని పదార్థాలను హైలైట్ చేశాడు.  హుక్కా సేవించే సమయంలో ఎలాంటి పదార్థాలు కలుపుతారో  తెలియడం లేదని అన్నారు.  

ప్రస్తుతం.. COTPA (సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధిత చట్టం) ప్రకారం .. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించబడింది. కర్నాటక ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసింది, ఇందులో బహిరంగంగా పొగాకు వినియోగాన్ని నిషేధించడం, పొగాకు వినియోగం, సిగరెట్ తాగడంపై నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాను పెంచడం వంటివి ఉన్నాయి.

COTPA ప్రకారం..  విద్యా సంస్థల పరిధిలొ పొగాకు అమ్మకాలను నిషేధించింది. ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలతో పాటు పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించే చట్టాన్ని సవరించాలని ఆరోగ్య మంత్రి దినేష్ గుండురావు సూచించారు.

 COTPA చట్టం ప్రకారం.. 18 ఏళ్లలోపు ఎవరికైనా సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించడం నిషేధించబడింది. ఇప్పుడు ఈ పరిమితిని 21 ఏళ్లకు పెంచాలని ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. పొగాకు, సిగరెట్‌ల వినియోగం యువతలో క్యాన్సర్‌కు కారణమవుతుందని ఆరోగ్య మంత్రి అన్నారు. అందువల్ల కొన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం అవసరమని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios