Karnataka Election: కర్ణాటక అసెంబ్లీలో 95 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే..
Karnataka Election: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఇదిరకటి నివేదికలు గమనిస్తే కర్నాటక అసెంబ్లీలో 95 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారు.
Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీలో 95 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులుగా ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఏడీఆర్ నివేదికల ప్రకారం కర్ణాటక అసెంబ్లీలో 95 శాతం మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులే. సంపన్న అభ్యర్థులను నిలబెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోరు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. విశేషమేమిటంటే, 97 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు తమ కోటీశ్వరుల హోదా గురించి గర్వంగా చెప్పుకున్నారు. అలాగే, బీజేపీ నుంచి 96 శాతం మంది ఉన్నారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023 పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఇప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూస్తున్నారు. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు గాను 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ మార్క్ 113 సీట్లు.
సహాయక పోలింగ్ కేంద్రాలతో సహా 58,545 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది.
కర్ణాటక ఎగ్జిట్ పోల్స్: ఇప్పటివరకు ఒపీనియన్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి..
- ABP న్యూస్-సీ ఓటర్: కాంగ్రెస్ 110 నుండి 122 సీట్లు గెలుస్తుందని అంచనా వేయబడింది. బీజేపీకి 73 నుంచి 85, జేడీ(ఎస్)కి 21 నుంచి 29 సీట్లు వస్తాయని అంచనా.
- ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: కాంగ్రెస్కు 105 సీట్లు, బీజేపీకి 85 సీట్లు వచ్చే అవకాశం ఉంది. జేడీ(ఎస్) 32 సీట్లు గెలుచుకోవచ్చు.
- ఇండియా టుడే-సీవోటర్: బీజేపీ 74-86 సీట్లు గెలుచుకోవచ్చనీ, కాంగ్రెస్ 107-119 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.
- ఈడినా ఒపీనియన్ పోల్: కాంగ్రెస్కు 132 నుంచి 140 సీట్లు మెజారిటీ, బీజేపీ 57-65 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది.
- జీ న్యూస్-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్: బీజేపీ 103 నుంచి 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 79 నుంచి 91 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. జేడీ(ఎస్) 26-36 సీట్లు గెలుచుకోవచ్చు.
- NDTV సర్వే: NDTV-లోకినీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ సర్వే ప్రకారం, కాంగ్రెస్ బీజేపీ కంటే ముందంజలో ఉంటుందనీ, ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య అత్యంత ప్రజాదరణ పొందిన ఎంపికగా పేర్కొంది.