కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కన్నడిగులు ఏ విధమైన తీర్పు ఇస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కన్నడిగులు ఏ విధమైన తీర్పు ఇస్తారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారే విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎన్నికల పోలింగ్‌కు ముందు కన్నడిగులు ఎటూవైపు చూస్తున్నారనే దానిపై ఏషియానెట్ న్యూస్- జన్ కీ బాత్ నిర్వహించిన ఓపినియన్ పోల్‌లో.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. బీజేపీకి 100 నుంచి 114 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. అయితే కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే బీజేపీ ఈ మార్క్‌కు దగ్గరగా ఉండనుందని సర్వే అంచనా వేసింది. 

ఇక, కాంగ్రెస్ పార్టీ 86 నుంచి 98 స్థానాలు కైవసం చేసుకోని రెండో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే అంచనా వేసింది. జేడీఎస్ 20 నుంచి 26 స్థానాల్లో, ఇతరులు 0 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని సర్వే తెలిపింది. ఇక, ఈ సర్వేను ఏప్రిల్ 15 నుంచి మే 1 మధ్య నిర్వహించగా.. అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ 30 వేల మంది నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది.

Also Read: కర్ణాటకలో ప్రాంతాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?.. ఏషియానెట్-జన్‌ కీ బాత్ సర్వే‌‌‌ అంచనాలివే..

ఇటీవల ఏషియానెట్‌ న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ రౌండ్-1ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గత సర్వేతో పోలిస్తే.. బీజేపీకి కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా తాజా సర్వేలో తేలింది. బీజేపీకి 98 నుంచి 109 సీట్లు వచ్చే అవకాశం ఉందని గత సర్వే అంచనా వేయగా.. ఇప్పుడు అది 100 నుంచి 114గా ఉంది. ప్రధాని మోదీ ఫ్యాక్టర్ ఇందుకు కారణంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. ఓట్ల శాతం విషయానికి వస్తే బీజేపీ కంటే కాంగ్రెస్‌కు స్వల్పంగా ఎడ్జ్ కనిపిస్తుంది. బీజేపీకి 38 నుంచి 40.05 శాతం, కాంగ్రెస్‌కు 38.5 నుంచి 41.5 శాతం, జేడీఎస్‌కు 14 నుంచి 16.5 శాతం, ఇతరులకు 4 నుంచి 7 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. గత సర్వేతో పోలిస్తే.. బీజేపీకి ఓట్ల శాతంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. 

ఇక, అయితే ప్రాంతాలవారీగా గణంకాలు పరిశీలిస్తే.. పాత మైసూరులో ముక్కోణపు పోరు ఉన్నప్పటికీ, గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ మరింత పుజుకుందని ఏషియానెట్‌ న్యూస్- జన్ కీ బాత్ ఒపీనియన్ పోల్ సర్వే అంచనా వేసింది. గతంలో ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కు 23 స్థానాలు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు ఆ సంఖ్య 26గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో జేడీఎస్ కొన్ని సీట్లు కోల్పోయే అవకాశం ఉండగా.. బీజేపీ కొన్ని సీట్లు లాభపడే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 

 బెంగళూరు రీజియన్‌కు విషయానికి వస్తే.. ఇక్కడ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఇక్కడ 32 నియోజకవర్గాలు ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరా హోరీ పోరు సాగనుందని సర్వే అంచనా వేసింది. సెంట్రల్ కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మద్య హోరాహోరీ పోరు సాగనుంది. 

హైదరాబాద్ కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడ కాంగ్రెస్‌కు కొద్దిగా ఎడ్జ్‌ ఉన్నట్టు అంచనా వేయబడినప్పటికీ.. కిందటి సర్వేతో పోలిస్తే కాంగ్రెస్‌కు కొంత ఆదరణ తగ్గింది. ముంబై కర్ణాటక విషయానికి వస్తే.. ఇక్కడ బీజేపీ మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది. కోస్తా కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. అయితే గతంతో పోలిస్తే.. పలు ప్రాంతాల్లో బీజేపీకి ఆదరణ పెరిగినట్టుగా సర్వే అంచనా వేసింది. ఇందుకు ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫ్యాక్టర్ కారణంగా కనిపిస్తుంది. 

Also Read: ఏషియానెట్-జన్‌ కీ బాత్ సర్వే: కర్ణాటక ఎన్నికల్లో ఈ ఆరుగురు వీవీఐపీ అభ్యర్థుల భవిష్యత్తు ఎలా మారబోతుంది..?

ఇక, జన్ కీ బాత్ విషయానికి వస్తే.. ఇంతకుముందు 36 సర్వేలను నిర్వహించింది. అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలలో కచ్చితమైన లేదా దాదాపు కచ్చితమైన ఫలితాలు, పోకడలను అంచనా వేసింది. ఇక, 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో జన్ కీ బాత్ ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేసింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో కూడా జన్ కీ బాత్ కచ్చితమైన అంచనాలను ఇచ్చింది. ఇదిలా ఉంటే..కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.