Karnataka: బీజేపీ టార్గెట్ గా '40 పర్సెంట్ సర్కార్' ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్
Karnataka: అవినీతిపై బీజేపీని టార్గెట్ చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రభుత్వంపై భయపడకుండా ఫిర్యాదులను నమోదు చేయాలని పౌరులను కోరింది. ఈ క్రమంలోనే '40 పర్సెంట్ సర్కార్ క్యాంపెయిన్' ను ప్రారంభించింది.
40 per cent sarkar: అవినీతికి వ్యతిరేకంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ని టార్గెట్ చేస్తూ '40 పర్సెంట్ సర్కార్ క్యాంపెయిన్'ను ప్రారంభించింది. పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ఫిర్యాదులన్నింటినీ తీసుకుంటామనీ, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని తెలిపింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కర్ణాటక కాంగ్రెస్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని (బీజేపీ) లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని ప్రారంభించింది. www.40percentsarkara.com వెబ్సైట్ లో పౌరులు తమకు జరిగిన అవినీతి పిర్యాదులను నమోదుచేయాలని కోరింది. కాంగ్రెస్ పార్టీ పౌరుల కోసం అవినీతిపై పోరాటం సాగిస్తుందని తెలిపారు.
అంతకుముందు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అవినీతిపై తాను ఎంచుకున్న సమయంలో బహిరంగ వేదికపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర పరిపాలనను దోపిడీదారులు-మోసగాళ్ళతో నిండిన '40 పర్సెంట్ సర్కార్' అని ఆరోపించారు. పార్టీ లేవనెత్తిన అవినీతికి సంబంధించిన ప్రశ్నలపై ప్రభుత్వం మౌనాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుందని కాంగ్రెస్ పేర్కొంది. "మేము '40 పర్సెంట్ సర్కారా, బీజేపీ ఆండ్రే బ్రష్టాచార ' ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాము. ఇది ప్రతి కన్నడిగ బీజేపీకి వ్యతిరేకంగా వారి గొంతును పెంచడంలో సహాయపడుతుంది. ప్రచారంలో భాగంగా, ప్రజలు మా నంబర్ 844 770 40 40కి కాల్ చేయవచ్చు లేదా మా వెబ్సైట్ www.40percentsarkara.com కు లాగిన్ అవ్వవచ్చు. వారి ఫిర్యాదులను నమోదుచేయవచ్చు.. వారి తరఫున అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుంది. కన్నడ ప్రజల గొంతుకకు అండగా నిలుస్తుంది" అని కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది.
— Karnataka Congress (@INCKarnataka) September 13, 2022
బెళగావిలో కాంట్రాక్టర్ ఆత్మహత్యకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై తగిన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ, ఆయనకు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికార పార్టీ అవినీతి ప్రజా ఇబ్బందులను పెంచుతున్నదని పర్కొంది. తన మరణానికి ముందు, కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్.. అధికార పార్టీ నాయకుడు ఈశ్వరప్ప, అతని సహచరులు బెలగావిలోని హిందల్గాలో చేసిన రూ. 4 కోట్ల విలువైన రోడ్డు పనులకు చెల్లింపులు విడుదల చేయలేదనీ, 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించారు. అయితే, కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో మాజీ మంత్రి ఈశ్వరప్పకు క్లీన్ చిట్ లభించడం గమనార్హం.
మఠాల నుండి 30 శాతం, దేవాలయాల నుండి 40 శాతం కమీషన్ డిమాండ్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మత పవిత్రతను కలుషితం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. మంత్రులు అశ్వత్ నారాయణ, అరగ జ్ఞానేంద్ర, సుధాకర్లు కోట్లాది అవినీతికి పాల్పడ్డారని ఆరోపించింది. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రైతులను పణంగా పెట్టి బీజేపీ రూ.21,473 కోట్లు దోచుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. అన్ని ఫిర్యాదులను వింటామనీ, అన్ని ఫిర్యాదులను తీసుకునీ, పోరాటం సాగిస్తామని కాంగ్రెస్ పేర్కొంది.