ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తనకు జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ను వద్దంటూ పేర్కొనారు. ఈ విషయాన్ని బెంగళూరు పోలీస్ కమిషనర్కు తెలియజేసినట్లు తెలిపారు.
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ను ఉపసంహరించుకోవాలని సిద్ధరామయ్య బెంగళూరు పోలీసులను కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిద్ధరామయ్య తెలిపారు. బెంగుళూరులో ట్రాఫిక్ జామ్ ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. అలాగే ప్రభుత్వ లేదా వ్యక్తిగత కార్యక్రమాల్లో ప్రజలు తనకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు ఇవ్వకుండా.. పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.
ఈ మేరకు సిద్ధరామయ్య ట్వీట్ చేస్తూ.. "నా వాహనాల రాకపోకలకు సంబంధించిన 'జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్'ను ఉపసంహరించుకోవాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ను కోరాను. 'జీరో ట్రాఫిక్' కారణంగా నిషేధం అమలులో ఉన్న ట్రాఫిక్ను చూసిన తర్వాత తీసుకున్నాను." అని పేర్కొన్నారు.
జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ అంటే ఏమిటి?
జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ ప్రకారం.. ముఖ్యమంత్రి, ఇతర వీఐపీలు తమ ప్రయాణాల సమయంలో రద్దీని నివారించడానికి ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సీఎం లేదా వీఐపీ కాన్వాయ్ వెళ్లే మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సిద్ధరామయ్య నిర్ణయంతో సామాన్య ప్రజల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర కూడా తమ హయాంలో జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ను ఉపసంహరించుకున్నారు.
సిద్ధరామయ్య మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్తోపాటు 8 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 66, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి.