యడియూరప్ప కేబినెట్లో మార్పులు: ఏడుగురికి ఛాన్స్.. ఇద్దరిపై వేటు..?
కర్ణాటక కేబినెట్ను బుధవారం సీఎం యడియూరప్ప విస్తరించనున్నారు. సాయంత్రంలోగా ఆయన కొత్త మంత్రిమండలి వివరాలు ప్రకటించనున్నారు. ఆ వెంటనే నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.
కర్ణాటక కేబినెట్ను బుధవారం సీఎం యడియూరప్ప విస్తరించనున్నారు. సాయంత్రంలోగా ఆయన కొత్త మంత్రిమండలి వివరాలు ప్రకటించనున్నారు. ఆ వెంటనే నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు.
కేబినెట్లో కొత్తగా ఏడుగురికి చోటు దక్కుతుందని యడియూరప్ప వెల్లడించారు. అయితే ప్రస్తుత కేబినెట్లో ఎవరికైనా ఉద్వాసన పలుకుతారా అనే అంశంపై మాత్రం యడియూరప్ప క్లారిటీ ఇవ్వలేదు.
అయితే నూతన కేబినెట్ మంత్రులపై వస్తున్న వార్తలకు, తాను ప్రకటించబోయే దానికి వాస్తవంగా పొంతన ఉండబోదని యడియూరప్ప వెల్లడించారు. మరోవైపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్ సెక్రెటరీ అరుణ్ సింగ్లను ఆహ్వానించనున్నట్లు సీఎం తెలిపారు.
కేబినెట్ కూర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ యడియూరప్ప అయ్యారు. అనంతరం ఏడుగురికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అయితే ఇద్దరు కేబినెట్ మంత్రులపై వేటు పడే అవకాశం వుందని బీజేపీలో చర్చ జరుగుతోంది.