కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదంలో చిక్కుకొన్నారు. సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఓ మహిళ ప్రశ్నించడంతో కోపంతో ఓ మహిళ చున్నీని సిద్దరామయ్య లాగాడు.
బెంగుళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వివాదంలో చిక్కుకొన్నారు. సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారని ఓ మహిళ ప్రశ్నించడంతో కోపంతో ఓ మహిళ చున్నీని సిద్దరామయ్య లాగాడు.
కర్ణాటక రాష్ట్రంలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం నాడు సిద్దరామయ్య పర్యటించారు. ఈ నియోజకవర్గం నుండి సిద్దరామయ్య తనయుడు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని జమలా రాణి అనే మహిళ సిద్దరామయ్య దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కోపంతో ఊగిపోయిన సిద్దరామయ్య ఆ మహిళతో దురుసుగా ప్రవర్తించాడు.
తననే నిలదీస్తావా అంటూ సిద్దరామయ్య ఆ మహిళపై విరుచుకుపడ్డారు. ఆ మహిళ వద్ద ఉన్న మైక్ను లాగేసే ప్రయత్నం చేశారు. మైక్తో పాటు ఆ మహిళ ధరించిన చున్నీ కూడ వచ్చేసింది. సమస్యలను పరిష్కరించాలని ప్రస్తావించినందుకు తనను అవమానించారని ఆ మహిళ ఆరోపిస్తోంది.
Scroll to load tweet…
