Asianet News TeluguAsianet News Telugu

రేపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణం

సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీరమణ ఈ నెల 24న ప్రమాణం చేయనున్నారు. శుక్రవారంనాటితో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీకాలం ముగియనుంది. 

Justice N V Ramana to be sworn in as new Chief Justice of India on April 24 lns
Author
New Delhi, First Published Apr 23, 2021, 3:11 PM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీరమణ ఈ నెల 24న ప్రమాణం చేయనున్నారు. శుక్రవారంనాటితో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే పదవీకాలం ముగియనుంది. ఈ నెల 24వ తేదీ ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఎన్వీరమణతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణం చేయించనున్నారు.  2022 ఆగష్టు 26వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.2014 ఫిబ్రవరి 17 న సుప్రీంకోర్టు జడ్జిగా  బాధ్యతలు స్వీకరించడానికి ముందుగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పనిచేశారు.

also read:సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీరమణ: రాష్ట్రపతి ఉత్తర్వులు

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎస్ఏ బోబ్డే 2019 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించారు.రంజన్ గోగోయ్ తర్వాత బోబ్డే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో రమణ జన్మించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎన్వీ రమణ అంచెలంచెలుగా ఎదిగారు. కృష్ణా జిల్లా పొన్నవరంలో 1957 ఆగష్టు 27న జస్టిస్ ఎన్వీ రమణ జన్మించారు.1983 ఫిబ్రవరి 10న ఆయన న్యాయవాద వృత్తిని చేపట్టారు. 2000 జూన్ 27న లో ఏపీ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు ఆయన పదోన్నతిపై వెళ్లారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios