మరోసారి రిసార్ట్ రాజకీయాలను తెర.. స్పెషల్ చార్టర్ లో రాంచీ టు రాయ్ పూర్
జార్ఖండ్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సీఎం హేమంత్ సోరెన్ తన యూపీఏ కూటమి ఎమ్మెల్యేలను రాంచీ నుంచి రాయ్పూర్కు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జార్ఖండ్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. త్వరలో యూపీఏ కూటమి ఎమ్మెల్యేలతో కలిసి సీఎం హేమంత్ సోరెన్ రాంచీ నుంచి చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్కు వెళ్లనున్నట్లు సమాచారం. దీని కోసం ఆయన 72 సీట్ల ఇండిగో చార్టర్ బుక్ చేసినట్టు.. సాయంత్రం 5 గంటలకు ఇండిగో విమానంలో ఎమ్మెల్యేలందరినీ జార్ఖండ్ నుంచి బయటకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
అలాగే.. రాయ్పూర్లోని మేఫెయిర్ రిసార్ట్లో 47 గదులను కూడా బుక్ చేశారని సమాచారం. ఏ క్షణంలోనైనా గవర్నర్ తనపై అనర్హత వేటు నిర్ణయిం ప్రకటించే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేలను ఇతర రాష్ట్రాలకు తరలించాలని హేమంత్ సోరెన్ నిర్ణయించారు. అయితే ఈ ఎమ్మెల్యేలతో సీఎం వెళ్లార లేదా? అనేదనిపై స్పష్టత లేకుండా పోయింది.
నిజానికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అసెంబ్లీ సభ్యత్వానికి ముప్పు పొంచి ఉంది. అక్రమ మైనింగ్ కేసులో ఈసీ హేమంత్సోరెన్పై అనర్హత వేటు వేయాలని ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. హేమంత్ సోరెన్ సీఎం పదవిని కోల్పోతే.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభ పెడుతుందన్న భయం హేమంత్ సోరెన్ కు పట్టుకుంది. అందుకే మరోసారి రిసార్ట్ రాజకీయాలను తెర తీసినట్టు తెలుస్తుంది.
జార్ఖండ్లో రాజకీయ పరిస్థితి
సెప్టెంబర్ 1న సోరెన్ కేబినెట్ సమావేశాన్ని పిలిచినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. అదే సమయంలో, సోమవారం అంటే ఆగస్టు 29న, హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్ శాసనసభ్యులు కూడా ఎన్నికల కమిషన్లో చర్చించారు, అయితే దానిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తుందనీ, జార్ఖండ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర చేస్తోందని JMM, కాంగ్రెస్, RJDలతో కూడిన అధికార UPA మిత్రపక్షాలు ఆరోపిస్తున్నారు.
రాంచీ విమానాశ్రయం వెలుపల విలేకరులతో హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, “మేము ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.. దానిని పరిష్కరించడానికి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నాం. మీరు ఇంతకు ముందు కూడా ఆ వ్యూహం యొక్క సంగ్రహావలోకనం చూసారు. ఇప్పుడు కూడా చూస్తున్నారని తెలిపారు.
మైనింగ్ లీజు వివాదంలో హేమంత్ సోరెన్పై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) అనర్హత వేటు వేయడంపై జార్ఖండ్ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోయుపిఎ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నాలు చేస్తుంది.
మైనింగ్ లీజు వ్యవహరంలో సోరెన్ తన పదవిని దుర్వినియోగం చేసినందుకు దోషిగా నిర్థారించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం.. అతని ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. ఈ మేరకు గవర్నర్ రమేష్ బైస్ సూచనలు చేసింది. అయితే.. ఈ అంశంపై గవర్నర్ బైస్ తన ఉత్తర్వులను అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.