Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ! దిగువ కోర్టులో ఆ విషయంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం!!
Rahul Gandhi: పరువునష్టం దావా విషయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం విషయంలో జోక్యం చేసుకోవడానికి జార్ఖండ్ హైకోర్టు నిరాకరించింది. ఆయన దాఖాలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో దిగువ కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సూచించింది.
Rahul Gandhi: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ ఎదురుదెబ్బ తగిలింది. తనపై దాఖలైన పరువు నష్టం కేసును రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను జార్ఖండ్ హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ మాజీ చీఫ్ హైకోర్టును ఆశ్రయించారు.
వివరాల్లోకెళ్తే.. 2019 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై రాంచీ జిల్లా కోర్టులో న్యాయవాది ప్రదీప్ మోడీ ఫిర్యాదు చేశారు.
ఇంతకీ ఏమన్నడంటే..?
ఈ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నీరవ్ మోదీ, లలిత్ మోదీ చేసిన కుంభకోణాలను ఎత్తిచూపాడు. ఈ క్రమంలో ‘మోదీని ఇంటిపేర్లుగా పెట్టుకున్న వాళ్లంతా దొంగలే’ అని ఆయన ఆరోపించారు. ఈ ప్రకటన తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ, న్యాయవాది ప్రదీప్ మోడీ కాంగ్రెస్ నాయకుడిపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు.
అయితే.. పరువు నష్టం దావాను వ్యతిరేకంగా రాహుల్ గాంధీ దాఖాలు చేసిన పిటిషన్ పై మంగళవారం జస్టిస్ ఎస్కే ద్వివేది నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి రాహుల్ గాంధీ పిటిషన్ను కొట్టివేసింది. దిగువ కోర్టులో హాజరై తన వాదనను వినిపించాలని ఆదేశించింది.
కింది కోర్టు తనపై తీసుకున్న సుమోటో కాగ్నిజెన్స్ను సస్పెండ్ చేయాలని రాహుల్ గాంధీ కోరారు మరియు దిగువ కోర్టు ప్రారంభించిన విచారణను పక్కన పెట్టారు. ఇదే విషయంలో ఆయన ప్రత్యేకంగా రూ.20 కోట్ల పరువు నష్టం దావాను కూడా ఎదుర్కొన్నారు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలపై జార్ఖండ్ హైకోర్టు గతంలో బలవంతపు చర్య నుండి ఉపశమనం పొందింది.
ఈ ఫిర్యాదుపై కోర్టు గాంధీని 2019 ఫిబ్రవరి 22న కోర్టుకు హాజరుపరిచి తన తరఫు వాదనను వినిపించాలని ఆదేశించింది. కానీ దిగువ కోర్టుకు హాజరు కాకుండా, గాంధీ ఈ సమన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. మొత్తం కేసును కొట్టివేయాలని డిమాండ్ చేశారు, కానీ అతను విజయం సాధించలేదు.