జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఆదివారం నాడు ఉదయం జార్ఖండ్ రాష్ట్రంలోని ఢంకాలో మావోలు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటు చేసుకొంది.రెండు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందాడు. 

నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో భద్రతా బలగాలు కూంబింగ్‌ను పెద్ద ఎత్తున చేపట్టాయి.