జార్ఖండ్లో ఎన్కౌంటర్: నలుగురు మావోలు, ఓ జవాన్ మృతి
జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు
రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ జవాన్ మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం నాడు ఉదయం జార్ఖండ్ రాష్ట్రంలోని ఢంకాలో మావోలు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకొంది.రెండు వర్గాలు పరస్పరం కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందాడు.
నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో భద్రతా బలగాలు కూంబింగ్ను పెద్ద ఎత్తున చేపట్టాయి.