ఆయన పార్టీ కార్యకర్త కాదు.. వ్యాపారవేత్త.. ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ నేత సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను బీజేపీ ఏజెంట్ అని జేడీయూ అభివర్ణించింది. ఆయన రాజకీయ కార్యకర్త కాదని, బిజినెస్ మ్యాన్ అని, ఆయన కేవలం మార్కెటింగ్ తంత్రాలపై ఆధారపడతారని జేడీ(యూ) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ విమర్శించారు.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాట్నాలో విలేకరులతో లాలన్ సింగ్ మాట్లాడుతూ..
ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని అభివర్ణించారు. ఆయన బీహార్లో బీజేపీ అధికారం దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారని, ఆయన కేవలం తనను తాను మార్కెటింగ్ చేసుకుంటారని అన్నారు. బీహార్ సిఎం నితీష్ కుమార్ ఇచ్చిన ఆఫర్ను తాను తోసిపుచ్చానంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ కార్యకర్త కాదని, వ్యాపారవేత్త అని, ఆయన కేవలం మార్కెటింగ్ తంత్రాలపై ఆధారపడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీకే ను బీజేపీ వాడుకుంటోంది
అదే సమయంలో ఆర్సిపి సింగ్ ఉద్దేశించి లాలన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ కొంతకాలంగా బిజెపి కోసం పనిచేస్తున్నారని, ఆ విషయం అందరికీ తెలుసునని అన్నారు. ఇటీవల మేజిస్ట్రేట్ చెకింగ్లో బీజేపీ ఏజెంట్ పట్టుబడ్డాడనీ, బీహార్లో బీజేపీ కుట్రలపై ఆధారపడుతోందని విమర్శించారు. గతంతో ఆర్సిపి సింగ్ని ఉపయోగించుకున్న బీజేపీ.. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ని ఉపయోగించుకుంటుందని అన్నారు. బీహార్ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారనీ, బీజేపీ కుట్రలు బీహార్ లో
సఫలం కావని అన్నారు.
కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్ల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తాను బీహార్ ముఖ్యమంత్రితో నిష్కపటంగా మాట్లాడినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో తనకు అత్యంత ఇష్టమైన ఈ నిషేధం పూర్తిగా విఫలమైందని, దీనిపై సమీక్షించాలని ముఖ్యమంత్రికి సూచించారు. అలాగే.. నితీష్ కుమార్ ప్రత్యేక ఆఫర్ను తిరస్కరించినట్లు కూడా పికె పేర్కొన్నారు. కానీ ఆ వాదనలను లలన్ సింగ్ పూర్తిగా తోసిపుచ్చారు.
ఇదిలాఉంటే.. ప్రశాంత్ కిషోర్ ఇటీవలే 'జన సూరజ్' ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు కింద వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,500 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించనున్నారు.
బీహార్లో కొత్త రాజకీయ పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ను కలవాలనుకుంటున్నారని లాలన్ సింగ్ పేర్కొన్నారు. ముందుగా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలని కోరిన ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడారు. అందుకే ఆయన నన్ను కలవడానికి న్యూఢిల్లీకి వచ్చారు. పార్టీ క్రమశిక్షణను పాటిస్తానని అంగీకరిస్తే.. ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకునే అంశాన్ని పరిశీలించవచ్చని తాను పీకే తో చెప్పానని జేడీయూ అధ్యక్షుడు పేర్కొన్నారు.
2018లో నితీష్ కుమార్ జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న సమయంలో ప్రశాంత్ కిషోర్ను పార్టీలోకి తీసుకున్నారు. కొద్ది వారాల వ్యవధిలోనే.. పీకేకు జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అయితే.. సీఏఏ-ఎన్పీఆర్-ఎన్ఆర్సీపై కిషోర్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఆయనను జేడీయూ పార్టీ నుంచి 2020లో తొలగించారు.