Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్ లో భద్రతా దళాల కాల్పులు: ఓ బాలిక, ఇద్దరు యువకులు మృతి

జమ్మూకాశ్మీర్ మరోసారి రణరంగంగా మారింది. గ్రామాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు చేపట్టిన కార్డన్ సెర్చ్ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులతో పాటు ఓ బాలిక మృతిచెందింది. 

jammu kashmir encounter

జమ్మూకాశ్మీర్ మరోసారి రణరంగంగా మారింది. గ్రామాల్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదులను పట్టుకోవడానికి భద్రతా దళాలు చేపట్టిన కార్డన్ సెర్చ్ కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులతో పాటు ఓ బాలిక మృతిచెందింది. 

వివరాల్లోకి వెళితే...కుల్గావ్ జిల్లాలోని హవూరా గ్రామంలో భద్రతా దళాలు తనికీలు చేపట్టాయి. ఉగ్రవాదులు పటు మారుమూల గ్రామాల్లో తలదాచుకుంటూ అలజడి సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వారిని పట్టుకోవడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపడుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది.

గ్రామంలో తనికీ చేపడుతున్న సైనికులపై అల్లరిమూకలు రాళ్ల దాడికి దిగాయి. దీంతో సైన్యం రక్షణ కోసం వారిని చెదగొట్టే క్రమంలో కాల్పులు ప్రారంభించింది. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులతో పాటు ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను షకీర్ అహ్మద్ (22), ఇర్షద్ మాజిద్ (20), అంద్లీబ్ (16)గా భద్రతా దళాలు గుర్తించాయి. 

అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై పుకార్లు చెలరేగుతుండటంతో అనంతనాగ్, సోఫియాన్, పుల్వామా, కుల్గామ్ జిల్లాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరింపజేశారు. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, పుకార్లు చెలరేగకుండా పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios