Pulwama Encounter: పుల్వామాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూ & కాశ్మీర్ పోలీసులు హతమార్చారు. మే 13న పోలీసు అధికారి రియాజ్ అహ్మద్ను హతమార్చడంలో.. మరణించిన ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరి ప్రమేయం ఉందని కాశ్మీర్ IGP విజయ్ కుమార్ తెలిపారు. .
Pulwama: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆదివారం హతమయ్యారు. పుల్వామాలోని ద్రాబ్గామ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టినట్లు గతంలో వార్తలు వచ్చాయి, అయితే ఆ తర్వాత మరో ఇద్దరు మరణించారు. ఉగ్రవాదుల నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రితో సహా నేరారోపణ చేసే పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు.
ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో రెండు AK 47 రైఫిల్స్ మరియు ఒక పిస్టల్ ఉన్నాయి. "మే 13న మా సహోద్యోగి అమరవీరుడు రియాజ్ అహ్మద్ను హతమార్చిన ఉగ్రవాదుల్లో ఒకరిని జునైద్ షీర్గోజ్రీగా గుర్తించారు. చనిపోయిన మరో ఇద్దరు ఉగ్రవాదులు పుల్వామా జిల్లాకు చెందిన ఫాజిల్ నజీర్ భట్ మరియు ఇర్ఫాన్ అహ్ మాలిక్గా గుర్తించారు" అని అధికారులు తెలిపారు.
"ముగ్గురూ హతమయ్యారు. ఉగ్రవాదులు స్థానికులు, ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) తో సంబంధం కలిగి ఉన్నారు. వారిలో ఒకరు మే 13న మా సహోద్యోగి అమరవీరుడు రియాజ్ అహ్మద్ను హతమార్చడంలో ప్రమేయం ఉన్న జునైద్ షీర్గోజ్రీగా గుర్తించారు" అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (IGP) కాశ్మీర్-విజయ్ కుమార్ తెలిపారు. కాగా, నిన్న సాయంత్రం 6.55 గంటలకు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. కాశ్మీర్ జోన్ పోలీసులు ఈ విషయాన్ని ట్వీట్లో తెలియజేశారు. శనివారం రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ పుల్వామా జిల్లా ద్రాబ్గామ్ ప్రాంతంలో దాదాపు 12 గంటల తర్వాత ముగిసింది.
ఇదిలావుండగా, జమ్మూకాశ్మీర్ విభజన తర్వాత అక్కడ కొద్ది నెలల పాటు ఉగ్రదాడులు, కార్యకలాపాలు నిలిచిపోయి.. శాంతియుత వాతావరణం కనిపించింది. అయితే, గత రెండు నెలలుగా జమ్మూకాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో ఉగ్రదాడులు మళ్లీ షురు అయ్యాయి. మరీ ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతుండటం పై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
