Asianet News TeluguAsianet News Telugu

కారులో యువతిపై ముగ్గురు ఐటీ ఉద్యోగల అత్యాచారయత్నం.. పీకలదాకా తాగి.. తోటి ఉద్యోగిపైనే..

నుంగంబాక్కం నెల్సన్ మాణిక్కం రోడ్డులో శ్రీలంక రాయబార కార్యాలయం సమీపంలో వేగంగా వెళుతున్న కారులో ఓ యువతి బిగ్గరగా అరుస్తూ ముగ్గురు యువకులను చెప్పులతో కొడుతూ వచ్చింది. ఆమె కేకలు విని గస్తీ తిరుగుతున్న పోలీసులు వెంటనే ఆ కారును నిలిపి విచారణ జరిపారు. 

IT employees attempted rape on a woman co employee in chennai
Author
Hyderabad, First Published Nov 25, 2021, 4:27 PM IST

చెన్నై : తమిళనాడులోని చెన్నై నగరంలో బుధవారం వేకువజామున కారులో ఓ యువతిపై ఐటీ సంస్థ ఉద్యోగులు ముగ్గురు Rape Attemptకి పాల్పడ్డారు. వేగంగా వెళుతున్న కారులో ఆ యువతి బిగ్గరగా కేకలు పెట్టడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు అడ్డుకుని ఆమెను కాపాడారు. 

నుంగంబాక్కం నెల్సన్ మాణిక్కం రోడ్డులో శ్రీలంక రాయబార కార్యాలయం సమీపంలో వేగంగా వెళుతున్న కారులో ఓ యువతి బిగ్గరగా అరుస్తూ ముగ్గురు యువకులను చెప్పులతో కొడుతూ వచ్చింది. ఆమె కేకలు విని గస్తీ తిరుగుతున్న పోలీసులు వెంటనే ఆ కారును నిలిపి విచారణ జరిపారు. కారులో యువతి, ఆమెతో పాటు ఉన్న ముగ్గురు యువకులు పీకల దాకా liquor తాగి మత్తులో ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. 

ముగ్గురు యువకులు వేలూరు జిల్లాకు చెందినవారని, దురైపాక్కంలోని IT companyలో పనిచేస్తున్నారని పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఆ యువతి, ముగ్గురు యువకులు అన్నాసాలైలోని Star Hotelలో Drink partyలో పాల్గొని కారులో తిరిగి వెడుతున్నారని, మత్తులో ఉన్న యువకులు ఆమె మీద Sexual harassmentకు పాల్పడుతూ అత్యాచారయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కనుగొన్నారు. 

ఇదిలా ఉండగా కారును నడిపి డ్రైవర్ పోలీసులను చూడగానే పారిపోయారు. అతడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై థౌజెండ్ లైట్స్ మహిళా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ శివార్లోని మోమిన్ పేట్ లో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కూతురు జీవితాన్ని నాశనం చేశాడు. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కన్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన వెలుగు చూడడంతో స్థానికంగా కలకలం రేగింది. 

పదిహేనేళ్లకే ప్రేమ, గర్భం.. పుట్టిన శిశువును ఏం చేయాలో తెలీక.. గొంతుకు తాడు బిగించి..

మోమిన్ పేట్ వలయాధికారి వెంకటేశం బుధవారం తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని ఓ గ్రామానికి చెందిన తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం Patan Cheru వెళ్లి అక్కడే ఉంటున్నారు. వీరి కుమార్తె కస్తూర్బా లో చదువుకుంటుంది. lock down కారణంగా ఇంటికి వచ్చేసింది. తండ్రి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేవాడు.

ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న కూతురిని బెదిరించి మూడు నెలలుగా sexual assault కి పాల్పడుతున్నాడు. బాలిక నాయనమ్మ  మృతి చెందడంతో తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగివచ్చి స్థానికంగా కూలీ పనులు చేసుకుంటున్నారు. daughter నీరసంగా ఉండటాన్ని గమనించిన తల్లి నాలుగు రోజుల క్రితం స్థానిక hospitalకి తీసుకువెళ్ళింది. అక్కడి వైద్యులు బాలికను పరీక్షలు నిర్వహించి ఆమె pregnant అని చెప్పారు. దీంతో షాక్ కు గురైన తల్లి... కూతురిని తిట్టేసింది.

ఆ తరువాత ‘ఎవరినైనా మాప్రేమించావా చెప్పు.. వారి parentsతో మాట్లాడి నీకు పెళ్లి చేస్తామని* తల్లి గట్టిగా నిలదీసింది. దీంతో కూతురు ఏడుస్తూ పటాన్ చెరులో ఉన్నప్పుడు తండ్రే తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పంతో ఆమె కన్నీటి పర్యంతమయ్యింది. మంగళవారం రాత్రి తల్లి మోమిన్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios