పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌పై జరిగిన వైమానిక దాడిలో భారత సైన్యం సాధించిన విజయంలో ఇస్రో కీలక పాత్ర పోషించింది. ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించిన ఖచ్చితమైన చిత్రాలను సైన్యానికి అందించింది.

న్యూఢిల్లీ: భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఓ ఉగ్రదాడిని నిర్వహించాయి. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో జరిగిన ఈ కీలక దాడిలో భారత సైన్యానికి బెంగళూరులోని ఇస్రో కీలకమైన సమాచారాన్ని అందించింది. పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన దాడిలో 26 మంది హిందువులను చంపిన ఘటనకు ప్రతీకారంగా భారత్ ఈ దాడికి దిగింది.

భారత భద్రతా దళాలు పాకిస్తాన్‌పై దాడికి సిద్ధమైన వెంటనే ఇస్రో నుంచి ఉపగ్రహ ఆధారిత సమాచారాన్ని కోరాయి. ఉపగ్రహాల సాయంతో పాకిస్తాన్ సైనిక స్థావరాలు, ఉగ్రవాద క్యాంపుల ఖచ్చితమైన చిత్రాలు సేకరించి భారత సైన్యానికి అందించబడింది. ఈ డేటా ఆధారంగా దాడులు ప్లాన్ చేసి, 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.

ఇస్రోకు చెందిన అత్యాధునిక ఉపగ్రహాలు 0.6 మీటర్ల నుంచి 0.35 మీటర్ల స్పష్టతతో భూప్రదేశాలను పరిశీలించగలగటం వల్ల శత్రువుల స్థావరాల స్థితి, కదలికలపై నిఖార్సైన సమాచారం లభించింది. దాడికి ముందు, దాడి జరుగుతున్న సమయంలో, తర్వాత కూడా పాకిస్తాన్ సరిహద్దులపై నిఘా కొనసాగించబడింది. డ్రోన్లు, క్షిపణులు వంటి మారుమూల దాడులను కూడా సమర్థంగా గుర్తించి భారత సైన్యం ముందస్తు చర్యలు తీసుకోగలిగింది.

ఇంతమాత్రానిది కాదు. భారత్ రష్యా నుంచి కొనుగోలు చేసిన S-400 వాయుసేన రక్షణ వ్యవస్థ ఈ దాడిలో మరింత బలాన్ని చేకూర్చింది. ఈ వ్యవస్థ 600 కి.మీ. దూరంలో లక్ష్యాలను గుర్తించి, 400 కి.మీ. పరిధిలోనే వాటిని ఛేదించగలదు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో దీన్ని మోహరిచారు.ఆపరేషన్ సింధూర్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ దాడిని ప్రకటించిన వారు మహిళా సైనికాధికారులు. హిందూ-ముస్లింలు కలసి ఉగ్రవాదానికి ఎదురుగుండా నిలిచిన ఈ ఆపరేషన్‌లో భారత ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పింది.