Asianet News TeluguAsianet News Telugu

నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్‌ఎల్‌వీ డీ-2 రాకెట్

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ సెంటర్  నుండి  ఎస్ఎస్ఎల్ వీ డీ -2 రాకెట్   ఇవాళ నింగిలోకి వెళ్లింది.

ISRO launches new rocket 'SSLV-D2' from Sriharikota
Author
First Published Feb 10, 2023, 9:27 AM IST


న్యూఢిల్లీ:  శ్రీహరికోట  షార్ సెంటర్  నుండి   ఎస్ఎస్ఎల్‌వీ డీ-2 రాకెట్  ను  శుక్రవారం నాడు  ప్రయోగించారు.  ఈ ప్రయోగం విజయవంతమైంది.  నిర్ధేశించిన కక్ష్యలోకి  ఉపగ్రహలను  రాకెట్  ప్రవేశపెట్టింది.   13 నిమిషాల 2 సెకన్ల వ్యవధిలో  ఈ ప్రయోగం  పూర్తైంది.దీంతో  ఇస్రోలో  శాస్త్రవేత్తలు సంబరాలు  చేసుకున్నారు. 

మూడు చిన్న తరహ శాటిలైట్లను  ఈ రాకెట్ ద్వారా  ఇస్రో పంపింది .శ్రీహరికోటలోని సతీష్ థావన్  స్పేస్ సెంటర్ లో మొదటి  లాంచ్ ప్యాడ్  నుండి ఇవాళ ఉదయం ఎస్ఎస్‌ఎల్‌వీడీ-2 ను ప్రయోగించారు.  ఎస్ఎస్ఎల్ వీ డీ 2  రాకెట్  మూడు  శాటిలైట్లను  450 కి.మీ  వృత్తాకార  కక్ష్యలోకి  ప్రవేశ పెట్టింది . అమెరికాకు  చెందిన  1 ఒక ఉపగ్రహం,   ఇండియాకు  చెందిన  రెండు ఉపగ్రహలు  కక్ష్యలోకి చేరినట్టుగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. 

ఈఓఎస్-07 అనే శాటిలైట్  156.3 కిలోల బరువుంది.  దీనిని ఇస్రో  అభివృద్ది  చేసింది.  జానస్-1 అనే ఉపగ్రహం  10.2 కిలోల  బరువుంది.  అమెరికాలోని  అంటారిస్ కు చెందింది.  ఆజాదీశాట్-2 ఉపగ్రహం  8.2 కిలోల బరువుంది. 

ఎస్ఎస్ఎల్ వీ  డీ-1 యొక్క  తొలి ప్రయోగం   విఫలమైంది.  గత ఏడాది ఆగస్టు మాసంలో  ఈ ప్రయోగం జరిగింది.   ఉపగ్రహలను  మోసుకెళ్లిన  రాకెట్  నిర్ధేశించిన కక్ష్యలోకి  ఉపగ్రహలను  పంపలేకపోయింది.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios