అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలపై సస్పెన్షన్ ను డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ డిజిసిఎ ఓ ప్రకటన జారీ చేసింది. భారత్ నుండి ఇతర దేశాలకు, అక్కడి నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ నవంబర్ 30 తో ముగియనుండడంతో దాన్ని పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలపై సస్పెన్షన్ ను డిసెంబర్ 31వరకు పొడిగిస్తూ డిజిసిఎ ఓ ప్రకటన జారీ చేసింది. భారత్ నుండి ఇతర దేశాలకు, అక్కడి నుంచి భారత్ కు వచ్చే అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల విమానాల సస్పెన్షన్ నవంబర్ 30 తో ముగియనుండడంతో దాన్ని పొడిగిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
దేశీయ ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) గురువారం నాడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. అయితే అంతర్జాతీయ కార్గో విమానాలకు, డిజిసిఎ చేత ప్రత్యేకంగా ఆమోదించబడిన విమానాలకు ఈ పరిమితులు వర్తించవు అని అధికారిక సర్క్యులర్ తెలిపింది.
ఈ యేడాది జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్ లో పాక్షిక మార్పులు చేశామని, ఈ సర్క్యూలర్ గడువును 2020 డిసెంబర్ 31, అర్థరాత్రి 23 గంటల 59ని.ల వరకు పొడిగించామని తెలిపింది. భారతదేశానికి / భారతదేశానికి షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణీకుల సేవలకు సంబంధించి పైన పేర్కొన్న అంశంపై జారీ చేసిన సర్క్యులర్ ప్రామాణికతను మరింత పెంచిందని డిజిసిఎ సర్క్యులర్లో తెలిపింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 26, 2020, 5:01 PM IST