ఢిల్లీ నుంచి వడోదరకు బయల్దేరిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గంమధ్యలో జైపూర్లోనే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఇంజిన్లో వైబ్రేషన్ వచ్చినట్టు తెలిసింది. అందుకే ఫ్లైట్ను అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నుంచి గుజరాత్లోని వడోదరకు వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో జైపూర్లో అత్యవసర ల్యాండింగ్ అయింది. ఇంజిన్లో వైబ్రేషన్ వచ్చాయని కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా మార్గంమధ్యలో జైపూర్లోనే ల్యాండింగ్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలైంది.
ఢిల్లీ నుంచి వడోదరకు ఇండిగో విమానం 6E-859 బయల్దేరింది. అయితే, ఫ్లైట్ గాల్లోకి లేసిన కొద్ది సేపటికి, గమ్యస్థానం చేరముందే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రాజస్తాన్ రాజధాని జైపూర్లో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
అయితే, ఈ కారణం చేత విమాన ఇంజిన్లో వైబ్రేషన్ వచ్చిన విషయం తెలియరాలేదు. అలాగే, ఈ సమయంలో విమానంలో ఎంత మంది ఉన్న విషయాన్నీ ఇండిగో ఎయిర్లైన్స్ ఇంకా వెల్లడించలేదు.
సాంకేతిక సమస్యలతో ఇటీవలే స్పైస్ జెట్ వరుసగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం 18 రోజుల్లో 8 విమానాల్లో సాాంకేతిక లోపాలు వచ్చాయి. దీంతో ఈ నెల 6వ తేదీన స్పైస్జెట్ సంస్థకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కొన్నిరోజులుగా ఈ సంస్థకు చెందిన విమానాల్లో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు వెలుగుచూడంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది.
కాగా.. ఈ నెల 5వ తేదీన ఉదయం దిల్లీ నుంచి దుబాయ్ వెళ్తున్న స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక సమస్య తల్లెత్తడంతో అత్యవసరంగా.. ఆ విమానాన్ని కరాచీ వైపు మళ్లీంచారు. కరాచీ విమానాశ్రయలో ల్యాండ్ చేశారు. ఈ ఘటన జరిగిన మరో కొద్ది గంటల్లోనే మరో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. కాండ్లా-ముంబై విమానంలో విండ్షీల్డ్ దెబ్బతినడం వల్ల ముంబయిలో ల్యాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ప్రమాాదంతోపాటు.. గత 17 రోజుల్లో.. 7 సార్లు స్పైస్జెట్ విమానాలు సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది.
