Asianet News TeluguAsianet News Telugu

India's first 5G call: స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో 5జీ టెస్ట్ కాల్ విజ‌య‌వంతం.. కేంద్రం ఏం చెప్పిందంటే..?

IIT Madras : స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో 5జీ టెస్ట్ కాల్ విజ‌య‌వంత‌మైంది. ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విజయవంతంగా 5జీ టెస్ట్‌ కాల్‌ చేశారు.
 

Indias first 5G call, IIT Madras , Made in India technology, India , 5G , Ashwini Vaishnaw,
Author
Hyderabad, First Published May 20, 2022, 12:04 PM IST

Made in India technology: దేశీయంగా అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన 5జీ ట్రయల్ నెట్‌వర్క్‌పై కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మొదటి 5G కాల్ చేశారు.  స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో 5జీ టెస్ట్ కాల్ విజ‌య‌వంత‌మైంది. ఐఐటీ మద్రాస్‌లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విజయవంతంగా 5జీ టెస్ట్‌ కాల్‌ చేశారు.మొద‌టి కాల్‌ విజయవంతమైన నేపథ్యంలో 5జీ స్పెక్ట్రం వేలం ప్రతిపాదన వచ్చేవారం తుది ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌ ముందుకు వచ్చే అవకాశముంద‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.  దీనికి సంబంధించి అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరికి దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వ‌చ్చే అకాశాలున్నాయ‌ని స‌మాచారం. 

కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్  స్పందిస్తూ..  "ఐఐటీ మద్రాస్‌లో ఆత్మనిర్భర్ భార‌త్ కింద‌ 5G టెక్నాల‌జీ విజయవంతంగా 5G కాల్‌ని పరీక్షించింది. మొత్తం ఎండ్-టు-ఎండ్ నెట్‌వర్క్ భారతదేశంలోనే రూపొందించబడింది. అభివృద్ధి చేయబడింది. ఇది ప్రధానమంత్రి దూర‌దృష్టికి సాక్షాత్కారం. మనం సొంతంగా 4G, 5G టెక్నాలజీ స్టాక్‌ను భారతదేశంలో అభివృద్ధి చేశారు.. ప్రపంచం కోసం భారత్ లో తయారు చేయబడింది. ఈ కొత్త టెక్నాలజీ స్టాక్‌తో మనం ప్రపంచాన్ని గెలవాలి”అని వైష్ణవ్ అన్నారు. ఐఐటీ మద్రాస్ నేతృత్వంలోని మొత్తం ఎనిమిది ఇన్‌స్టిట్యూట్‌లు బహుళ-ఇనిస్టిట్యూట్ సహకార ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేసిన 5G టెస్ట్ బెడ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. 

కొత్త టెక్నాలజీ విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంధనం తదితర రంగాల్లో డిజిటల్‌ టెక్నాలజీ సేవల రూపురేఖలను మారుస్తుందని ట్రాయ్‌ చైర్మన్‌ పీడీ వాఘేలా అన్నారు. 220 కోట్లకు పైగా వ్యయంతో ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. టెస్ట్ బెడ్ భారతీయ పరిశ్రమ మరియు స్టార్టప్‌లకు సహాయక పర్యావరణ వ్యవస్థను ప్రారంభిస్తుంది. ఇది 5G మరియు తదుపరి తరం సాంకేతికతలలో వారి ఉత్పత్తులు, నమూనాలు, పరిష్కారాలు మరియు అల్గారిథమ్‌లను ధృవీకరించడంలో వారికి సహాయపడుతుంది. ఇదిలావుండ‌గా, కేంద్ర మంత్రి  వైష్ణవ్ చెన్నై ఎగ్మోర్ (ఎంఎస్) రైల్వే స్టేషన్ మరియు ఎగ్మోర్ మెట్రో రైలు స్టేషన్‌ను కూడా సంద‌ర్శించారు. అక్క‌డి ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. "పెద్ద మరియు మధ్య తరహా రైల్వే స్టేషన్‌లు అన్నీ పునరభివృద్ధి చెందుతాయి. గాంధీనగర్ (గుజరాత్‌లో) మరియు రాణి కమలపాటి (మధ్యప్రదేశ్‌లో) రైల్వే స్టేషన్లు నేడు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి" అని ఆయన చెప్పారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios