New Delhi: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) తన 47వ రైజింగ్ డేని 1 ఫిబ్రవరి 2023న జరుపుకుంటుంది. ఈ క్ర‌మంలోనే రైజింగ్ డే సందర్భంగా భారత తీర రక్షక దళానికి ప్రధాని న‌రేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ఇండియన్ కోస్ట్ గార్డ్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు.  

Indian Coast Guard-Raising Day: భారత తీర రక్షక దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) బుధవారం తన 47వ రైజింగ్ డేని జరుపుకుంటుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు ఇండియన్ కోస్ట్ గార్డ్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందిస్తూ.. “కోస్ట్ గార్డ్ సిబ్బంది అందరికీ వారి రైజింగ్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఇండియన్ కోస్ట్ గార్డ్ దాని వృత్తి నైపుణ్యం-మన తీరాలను సురక్షితంగా ఉంచే ప్రయత్నాలకు ప్రసిద్ధి చెందింది. వారి భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. @ఇండియా కోస్ట్‌గార్డ్‌' ​​అని ప్రధాని మోడీ ట్వీట్‌ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

అలాగే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) తన 47వ రైజింగ్ డే సంద‌ర్భంగా వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. "ఇండియా కోస్ట్‌గార్డ్ కు వారి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు.. భారతదేశ సముద్రాన్ని రక్షించడానికి తమను తాము రక్షణ రేఖగా అందించడం ద్వారా వారు దేశ సేవకు తమ నిబద్ధతతో స్ఫూర్తిని పొందుతారు. వారి అజేయమైన దేశభక్తికి సెల్యూట్" అంటూ ట్వీట్ చేశారు.

Scroll to load tweet…

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సైతం ఇండియన్ కోస్ట్ గార్డ్ కు శుభాకాంక్షలు తెలిపారు. "ఇండియన్ కోస్ట్ గార్డ్ 47వ రైజింగ్ డే సందర్భంగా, మన తీరప్రాంత సంరక్షకులకు & మన దేశ రక్షకులకు మేము వందనం చేస్తున్నాము. సెంటినెల్స్ ఆఫ్ ది సీస్ నిస్వార్థ నిబద్ధత అసమానమైనది. మానవతా సంక్షోభ సమయంలో కూడా వారు ముందంజలో ఉంటారు" అని అన్నారు.

Scroll to load tweet…