భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ట్రైనర్ విమానం కర్ణాటకలోని చామరాజ్‌నగర్ సమీపంలో గురువారం కూలిపోయింది.

బెంగళూరు: భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ట్రైనర్ విమానం కర్ణాటకలోని చామరాజ్‌నగర్ సమీపంలో గురువారం కూలిపోయింది. అయితే కూలిన తర్వాత మంటలు చెలరేగడంతో విమానం ముక్కలైంది. అయితే ప్రమాదానికి ముందే అందులో ఉన్న ఇద్దరు పైలట్‌లు పారాచూట్ సాయంతో తప్పించుకున్నారు. దీంతో ఇద్దరు సురక్షితంగా బయపడ్డారు. వారిలో ఒక మహిళా పైలట్ కూడా ఉన్నారు. అయితే ట్రైనర్ విమానం సాధారణ శిక్షణ సమయంలో ఈ ఘటన జరిగింది.ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి భారత వైమానిక దళ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…