Amit Shah: భారతదేశాన్ని బలమైన,  సంపన్న దేశంగా మార్చాలనే దేశ స్వాతంత్య్ర‌ సమరయోధుల కలను రానున్న 25 ఏళ్ల‌లో భార‌త్ సాకారం చేయగలదనీ, దాని 100 వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని ఘ‌నంగా  జరుపుకోగలదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. 

Sardar Vallabhbhai Patel: భారత వ్యతిరేక శక్తులు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించినప్పటికీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తన దూరదృష్టితో బలమైన, ఐక్యమైన భారతదేశం కలను సాకారం చేశార‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమ‌వారం అన్నారు. సర్దార్ పటేల్ వారసత్వాన్ని తుడిచివేయడానికి అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ, భారతదేశ ప్రజలు అఖండ భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన చేసిన భారీ కృషికి కృతజ్ఞతతో ఆయనను స్మరించుకుంటున్నారని ఆయన అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివ‌రాల్లోకెళ్తే.. భారతదేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ర‌న్ ఫ‌ర్ యూనిటీని ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా పై వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం నుంచి ప్రారంభమైన 'రన్ ఫర్ యూనిటీ'లో క్రీడా ప్రముఖులు, క్రీడాభిమానులు, కేంద్ర పోలీసు బలగాల సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. "ఆ సమయంలో కూడా భారతదేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని విభజించడానికి అన్ని ప్ర‌య‌త్నాలు చేశాయి. సర్దార్ పటేల్ తన దూరదృష్టి, రాజకీయ చతురత ద్వారా జునాగర్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్‌ను భారత యూనియన్‌లోకి ఎలా తీసుకువచ్చారో మనం చూశాము" అని షా అన్నారు. సర్దార్ పటేల్ లేకుంటే బలమైన, అఖండ భారత్ సాధ్యం కాదని హోంమంత్రి అన్నారు. ప్రస్తుత భారతదేశాన్ని తయారు చేయడంలో సర్దార్ పటేల్ కీలకపాత్ర పోషించారనీ, భారతదేశ కలను సాకారం చేయడంలో ఆయన చేసిన కృషి అపారమని అన్నారు.

ప్రజలు సర్దార్ పటేల్ పేరును తీసుకున్నప్పుడల్లా, భారతదేశ మ్యాప్ వారి మనస్సులోకి వస్తుందని, సర్దార్ పటేల్ లేకుండా, భారీ.. బలమైన భారతదేశం ఉనికిలోకి వచ్చేది కాదని అన్నారు. భారత వ్యతిరేక శక్తులు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నించినప్పటికీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తన దూరదృష్టితో బలమైన, ఐక్యమైన భారతదేశం కలను సాకారం చేశార‌ని అమిత్ షా అన్నారు. సర్దార్ పటేల్ వారసత్వాన్ని తుడిచివేయడానికి అనేక సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ, భారతదేశ ప్రజలు అఖండ భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన చేసిన భారీ కృషికి కృతజ్ఞతతో ఆయనను స్మరించుకుంటున్నారని ఆయన అన్నారు. "స్వాతంత్య్రం సమయంలో అన్ని రాచరిక రాష్ట్రాలను యూనియన్ ఆఫ్ ఇండియా కిందకు తీసుకురావడమే సవాలు. సర్దార్ పటేల్ వాటన్నింటినీ యూనియన్ ఆఫ్ ఇండియా కిందకు తీసుకువచ్చారు" అని తెలిపారు.

అలాగే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో భారతదేశం పటిష్టంగా, స్వావలంబనగా, సుసంపన్నంగా మారేందుకు ముందుకు సాగుతోందని అన్నారు. ఈ విషయంలో గత ఎనిమిదేళ్లలో దేశం అనేక మైలురాళ్లను సాధించిందని తెలిపారు. 2047 నాటికి సర్దార్ పటేల్ ఊహించిన విధంగా భారత్‌ను తయారు చేయగలుగుతాం అని షా అన్నారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కింద, దేశం 100వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత బలమైన, అత్యంత సంపన్నమైన దేశంగా మార్చడానికి ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చేస్తాడని తెలిపారు.

అలాగే, గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. "గుజరాత్‌లో నిన్న (ఆదివారం) ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. సన్నిహితులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన అన్నారు. ర‌న్ ఫ‌ర్ యూనిటీ పాల్గొన్న వారికి షా ఐక్యతా ప్రతిజ్ఞ కూడా చేశారు. ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, మీనాక్షి లేఖి, నిసిత్ ప్రమాణిక్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం 2014 నుండి అక్టోబర్ 31ని 'రాష్ట్రీయ ఏక్తా దివస్' లేదా జాతీయ ఐక్యత దినోత్సవంగా పాటిస్తోంది. పటేల్ అక్టోబర్ 31, 1875న గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించారు. ఆయ‌న దేశ మొదటి హోం మంత్రి, ఉప ప్రధాన మంత్రిగా, పటేల్ 560 పైగా సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేసిన ఘనత పొందారు.