ఇండియాలో గత 24 గంటల్లో 16,862 కొత్త కరోనా కేసులు: మొత్తం 3,40,37,592కి చేరిక
ఇండియాలో గత 24 గంటల్లో 16,862 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.తాజాగా మరణించిన 379 మందితో ఇండియాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,51,814కి చేరుకొంది. దేశంలో 21 రోజులుగా కరోనా కేసులు 30 వేలకు దిగువనే నమోదౌతున్నాయి.
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 16,862 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో Corona cases 3,40,37,592కి చేరుకొన్నాయి. కరోనాతో నిన్న ఒక్క రోజే 379 మంది మరణించారు.India లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2,03,6789కి చేరాయి.216 రోజులుగా యాక్టివ్ కేసులు ఇంత తక్కువ సంఖ్యలో రికార్డు కావడం ఇదే ప్రథమంగా ICMR ప్రకటించింది. కరోనా రోగుల రికవరీ రేటు 98.07 గా నమోదైంది.
also read:చిత్తూరులో కరోనా జోరు:మొత్తం కేసులు 20,59,122కి చేరిక
తాజాగా మరణించిన 379 మందితో ఇండియాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 4,51,814కి చేరుకొంది.హర్యానా రాష్ట్రంలో కరోనాతో భారీగా నిన్న ఒక్క రోజే మరనించారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.దేశంలో నిన్న ఒక్క రోజే 379 మంది మరణిస్తే హర్యానా రాష్ట్రంలోనే 174 మంది మరణించారు.
దేశంలో 21 రోజులుగా కరోనా కేసులు 30 వేలకు దిగువనే నమోదౌతున్నాయి. 110 రోజులుగా 50 వేల కంటే తక్కువగానే కరోనా కేసులు రికార్డు అవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.గత 24 గంటల్లో 11 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఇప్పటివరకు ఇండియాలోొ 58,88,44,675 మందికి కరోనా నిర్ధారణ టెస్టులు చేశారు.దేశంలో నిన్న 30.26 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ అందింది. ఇప్పటివరకు 97.14 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు.
ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.