ఇండియాలో పెరిగిన కరోనా రికవరీ రేటు: మొత్తం కేసులు3,41,24,782కి చేరిక
ఇండియాలో గత 24 గంటల్లో 15,786కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,41,24,782కి చేరింది.
మరో వైపు కరోనాతో 231మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 13,24,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది.
న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 15,786కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,41,24,782కి చేరింది.మరో వైపు కరోనాతో 231మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజు 13,24,263 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ ప్రకటించింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,52,882కి చేరింది. మరోవైపు నిన్న 18,641మంది కరోనా నుండి కోలుకొన్నారు. దీంతో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 3,34,96,888కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
also read:కొత్త చరిత్ర సృష్టించాం,ప్రపంచం చూపు మనవైపే : 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీపై మోడీ
కరోనా రోగుల రికవరీ రేటు 98.16శాతానికి చేరిందని వైద్య ఆరోగ్యశాఖాధికారులు ప్రకటించారు. మరో వైపు కరోనా యాక్టివ్ కేసులు 1,75,745 కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.51 శాతంగా నమోదైందని ICMR తెలిపింది.27 రోజులుగా కరోనా కేసులు 30 వేల కంటే తక్కువగా నమోదయ్యాయి. 116 రోజులుగా 50 వేల కంటే తక్కువ కోవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో నిన్న 61,27,277 లక్షల మందికి Corona vaccine అందింది. ఇప్పటివరకు 97.65 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకొన్నారు.
ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.