Asianet News TeluguAsianet News Telugu

వరుసగా ఆరో రోజు మూడు లక్షలు దాటిన కోవిడ్ కేసులు: గత నెలతో పోలిస్తే రికార్డు మరణాలు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా ఆరో రోజూ కూడ కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. 

India records 319,435 cases, lockdown in Karnataka lns
Author
New Delhi, First Published Apr 27, 2021, 10:04 AM IST


న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వరుసగా ఆరో రోజూ కూడ కరోనా కేసులు మూడు లక్షలు దాటాయి. గత 24 గంటల్లో దేశంలో 3.2 లక్షల కేసులు రికార్డయ్యాయి. కరోనాతో సుమారు 2 ,766వేల మంది మరణించారు.గత 24 గంటల వ్యవధిలో కరోనాతో దేశంలో 271 మంది మరణించారు. కరోనా నుండి కోలుకొని 2,51,827 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో  ఇప్పవరకు 1,76,36,307 కేసులు రికార్డయ్యాయి.  ఈ మాసంలో ఇప్పటికే 34,595 మంది చనిపోయారు. గత వారం రోజుల వ్యవధిలోనే మృతుల సంఖ్య 17,333కి చేరుకొన్నాయి.

2020 సెప్టెంబర్ మాసంలో నమోదైన మరణాలతో పోలిస్తే ఈ మాసంలో అత్యధికంగా మరణాలు చోటు చేసుకొన్నాయి.  గత ఏడాదిలో 33,230 కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది మార్చి మాసంలో 5,656 మంది మరణించారు. ఏప్రిల్ మాసానికి వచ్చేసరికి  మరణాల రేటు ఆరు రేట్లు పెరిగింది. గత ఏడాది ఆగష్టు మాసంలో 28,954 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి మాసంలో 33,230 కేసులు రికార్డయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios