భారతదేశంతో కలవమని మయన్మార్ తిరుగుబాటు సంస్థకు ఇండియా ఆహ్వానం పంపింది. దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి.? దీనికి వారు ఎలా స్పందించారు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

India invited Myanmar's rebel group: ఇండియా పక్కనే ఉన్న మయన్మార్‌లో రాజకీయంగా అస్థిర పరిస్థితులు ఉన్నాయన్న విషయం తెలిసిందే. సుమారు 5 ఏళ్ల క్రితం మొదలైన ఈ అస్థిరత ఇంకా కొనసాగుతూనే ఉంది.  2021లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చెప్పి సైన్యం చేజిక్కించుకుంది. ఆ దేశపు లీడర్ ఆంగ్ సాన్ సూకీతో పాటు చాలామంది ముఖ్యమైన వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అప్పటినుంచి మయన్మార్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. 

మయన్మార్‌లో ఎమర్జెన్సీ 

మిలిటరీ పాలన మొదలయ్యాక, మయన్మార్‌లోని చాలా ఆయుధాలున్న గ్రూపులు దేశాన్ని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాయి. చాలా చోట్ల ఆయుధాలున్న గ్రూపులదే రాజ్యం అవుతోంది. అందుకే దేశం మొత్తం ఎమర్జెన్సీ పెట్టారు. మయన్మార్‌లో బతకలేక వేలాది మంది ఇండియాలోని మిజోరాం రాష్ట్రానికి శరణార్థులుగా వస్తున్నారు.

తిరుగుబాటు గ్రూపుని కలిసిన మిజోరం ఎంపీ

ఇలాంటి సమయంలోనే మిజోరం ఎంపీ వన్లాల్వేనా, ఇండియా సరిహద్దులో ఉన్న మయన్మార్ నార్త్ వెస్ట్ ప్రాంతాల్ని కంట్రోల్ చేస్తున్న తిరుగుబాటు గ్రూప్ చిన్లాండ్ కౌన్సిల్‌కిపాదయాత్రగా వెళ్లారు. మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) రాజ్యసభ ఎంపీ అయిన వన్లాల్వేనా, మయన్మార్‌లోకి పాదయాత్రగా వెళ్లి తిరుగుబాటు కౌన్సిల్ సభ్యులతో మాట్లాడారు. 

ఇండియాతో కలవమని ఆహ్వానం 

మయన్మార్‌లో అధికారికంగా ప్రభుత్వం లేనప్పుడు, రెండు ప్రాంతాల మధ్య బంధాలు బలంగా ఉండటం చాలా అవసరం అని ఆయన చెప్పారు. మయన్మార్‌లో స్థిరమైన  ప్రభుత్వం లేకపోవడంతో గత ఆరు నెలలుగా ఇండియాలోని మిజోరం బోర్డర్‌కి దగ్గరలో ఉన్న మయన్మార్ ప్రాంతాన్ని చిన్లాండ్ కౌన్సిల్ అనే తిరుగుబాటు గ్రూప్ పాలిస్తోంది.

మిజోరం ఎంపీ వన్లాల్వేనా తిరుగుబాటు గ్రూప్‌తో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్లాండ్ కౌన్సిల్ తిరుగుబాటు గ్రూప్‌తో వన్లాల్వేనా మాట్లాడుతూ.. మీరు సంతోషంగా ఇండియన్ యూనియన్ లో కలవొచ్చని ఆహ్వానించారు. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాలకు చెందిన  ప్రజల జాతి, సంస్కృతి బంధుత్వాల్ని గుర్తు చేస్తూ స్నేహాన్ని, సోదరభావాన్ని వివరించారు. 

సమాజ వ్యతిరేకులు కూడా వస్తున్నారు 

మయన్మార్‌లో అధికారం చేతులు మారాక మయన్మార్‌లోని చిన్-కుకీ-సో జాతితో పాటు చాలా గ్రూపుల వాళ్ళు మిజోరాంలో శరణార్థులుగా వచ్చారు. మిజోరం జిల్లా యంత్రాంగం వాళ్ళకి భోజనం, బస ఏర్పాటు చేసింది. మయన్మార్ నుంచి శరణార్థులు వస్తూనే ఉండటంతో బోర్డర్ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం ఉంది. ఈ శరణార్థుల ముసుగులో కొంతమంది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టేవారు కూడా భారత్ లోకి ప్రవేశిస్తున్నారు. 

సరిహద్దులో భద్రత కోసం:

సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొల్పేందుకు 'ఇండియాతో కలవండి' అని మయన్మార్ తిరుగుబాటు సంస్థకు ఇండియా తరపున చెప్పారు. ఈ తిరుగుబాటుదారుల సంస్థతో ఒప్పందం చేసుకుంటే బోర్డర్ ప్రాంతంలో భద్రతను పెంచొచ్చు అనే ఉద్దేశంతో ఇండియా తిరుగుబాటు సంస్థకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. తిరుగుబాటుదారుల సంస్థతో తను జరిపిన చర్చల వివరాల్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రికి చెప్పనున్నట్లు మిజోరం ఎంపీ వన్లాల్వేనా తెలిపారు. మరి ఇందుకు ఆ తిరుగుబాటు సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.