ఈయూ గ్రీన్ పాస్ : ఫలించిన భారత్ వ్యూహం.. ఏడు దేశాల్లో కోవిషీల్డ్ కు లైన్ క్లియర్....
ఈయూ గ్రీన్ పాస్ వివాదంపై భారత్ వ్యూహం ఫలించింది. ఏడు యూరోపియన్ యూనియన్ దేశాలు - ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఎస్టోనియా, ఐర్లాండ్, స్పెయిన్, ఐస్లాండ్ స్విట్జర్లాండ్ లు కోవీషీల్డ్ కు అనుమతులు క్లియర్ చేశాయి. ట్రావెల్ పాస్ లైన గ్రీన్ పాస్లకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ కు లైన్ క్లియర్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈయూ గ్రీన్ పాస్ వివాదంపై భారత్ వ్యూహం ఫలించింది. ఏడు యూరోపియన్ యూనియన్ దేశాలు - ఆస్ట్రియా, జర్మనీ, స్లోవేనియా, గ్రీస్, ఎస్టోనియా, ఐర్లాండ్, స్పెయిన్, ఐస్లాండ్ స్విట్జర్లాండ్ లు కోవీషీల్డ్ కు అనుమతులు క్లియర్ చేశాయి. ట్రావెల్ పాస్ లైన గ్రీన్ పాస్లకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ కు లైన్ క్లియర్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
ఈయూ అత్యున్నత వైద్య సంస్థ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) ఇప్పటివరకు నాలుగు టీకాలను మాత్రమే ఆమోదించింది. ఫైజర్/బయోఎన్టెక్, మెడెర్నా, వాక్స్జెర్విరియా, జన్స్సెన్ వ్యాక్సిన్లను మాత్రమే (ఈఎంఏ) ఆమోదించింది. వీటిని తీసుకున్న వారికి మాత్రమే టీకా పాస్పోర్ట్లు మంజూరు చేయబడతాయి. కరోనా సమయంలో దేశాల మధ్య ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి అనుమతిస్తారు.
ప్రపంచంలోని అతిపెద్ద తయారీ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ ఈ జాబితాలో లేదు. హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాక్సిన్ కూడా ఈఎంఏ జాబితాలో లేదు.
ఈ నిబంధనల ప్రకారం, కోవిషీల్డ్ లేదా కోవాక్సిన్తో టీకాలు తీసుకున్న భారతీయులు.. ఈ వ్యాక్సిన్లకు ఆయా దేశాలు అనుమతివ్వకపోతే.. క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. దీనిమీద భారత్ సీరియస్ అయ్యింది. మినహాయింపుల విషయంలో మాట్లాడితే ఇది పరస్పరంగా ఉంటుందని భారత విదేశాంగ శాఖ వర్గాలు బుధవారం తెలిపాయి.
ఈయూ గ్రీన్ పాస్ వివాదం : కొవాగ్జిన్, కోవిషీల్డ్ లను అనుమతించపోవడంపై కేంద్రం సీరియస్.....
యూరోపియన్ యూనియన్ కోవిషీల్డ్, కోవాక్సిన్ లను అంగీకరించకపోతే, వారి సర్టిఫికెట్లు కూడా దేశంలో అంగీకరించబడవని, ఈయూ నుంచి వచ్చేవారు భారత లో కఠిన క్వారంటైన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం ఈయు ఉన్నతాధికారి జోసెప్ బొరెల్ ఫాంటెల్లెస్ను కలిసినప్పుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎట్టకేలకు 27 దేశాల్లో 7 దేశాల్లో కోవిషీల్డ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కాస్త ఊరట లభించింది.
కాగా, వ్యాక్సినేషన్ పాస్పోర్టు విషయంలో లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ సర్టిఫికేషన్ ను యూరోపియన్ యూనియన్ అనుమతించకపోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. బదులుగా యూరోపియన్ దేశాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
ఈయూ దేశాల్లో అలాగే సభ్య దేశాల మధ్య ప్రయాణించే వారికి డిజిటల్ కోడ్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారు. అలాగే డిజిటల్ గ్రీన్ పాస్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అయితే ఈయూ ఆమోదిత వ్యాక్సిన్ లిస్టులో భారత్లో తయారవుతున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అనుమతించకపోతుండటం తెలిసిందే.
ఎక్కువ మంది భారతీయులు తీసుకుంటున్న కొవిషీల్డ్కు సైతం చోటు దక్కకపోవడంతో భారతీయ ప్రయాణికులకు ఇబ్బందిగా అంశమని ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని ఆ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరడంతో కేంద్రం త్వరితగతిన స్పందించింది.
తక్షణమే రెండు వ్యాక్సిన్ లకు అనుమతి ఇవ్వాలని లేకుంటే ఈయూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవని పేర్కొంది. ప్రయాణికుల వ్యాక్సిన్ పాస్పోర్ట్ లను అనుమతించమని పైగా కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని పరోక్షంగా ఈ యు ఏజెన్సీ (27 దేశాల సమాఖ్య)ను హెచ్చరించింది కేంద్రం.
ఈయూ వెళ్లానుకున్న వారికి షాక్.. కోవిషీల్డ్ వేసుకుంటే ‘గ్రీన్ పాస్’ కు నో..!!...
ఒకవేళ అనుమతిస్తే క్వారంటైన్ నిబంధనలను సడలిస్తామని కూడా తెలిపింది. ఇక ఈయూ డిజిటల్ కోవిడ్ సర్టిఫికెట్ లిస్టులో మన దగ్గర తయారైన రెండు వ్యాక్సిన్లను మొదటి ఫేజ్ లోనే చోటు ఇవ్వలేదు. గ్రీన్ పాస్ ప్రకారం కనీసం కొవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకైనా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.
అయినప్పటికీ యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పందించలేదు. అనుమతులు ఉన్న ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జనస్సెన్ వ్యాక్సిన్ లకు చోటిచ్చింది. ఇండియన్ వెర్షన్ ఆస్ట్రాజెనెకా ‘కొవిషీల్డ్’కు కూడా చోటివ్వలేదు. ఇక ఈ అనుమతులు మెరిట్ ప్రాతిపదికన మాత్రమే ఉంటాయని యూరోపియన్ యూనియన్ రాయబారి ఉగో అస్టుటో వెల్లడించాడు.
ఇక తాజా పరిణామాలపై యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) స్పందించింది. కొవిడ్ నేపథ్యంలో సభ్య దేశాల మధ్య ఆటంకాలు లేని ప్రయాణం కోసం గ్రీన్ పాస్ జారీ చేస్తున్నారని వివరించింది. ‘వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువీకరించడమే గ్రీన్ పాస్ జారీ లక్ష్యం. ఈ సర్టిఫికెట్ కోసం ఫైజర్/బయోఎన్టెక్, మెడెర్నా, వాక్స్జెర్విరియా, జన్స్సెన్ వ్యాక్సిన్లను మాత్రమే (ఈఎంఏ) ఆమోదించింది’ అని ఈయూ వర్గాలు తెలిపాయి.
అయితే కొవిషీల్డ్ను గ్రీన్ పాస్ జాబితాలో చేర్చాలని అభ్యర్థనలేవీ రాలేదని.. ఇంతవరకు అందలేదని వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఇక ఈ వ్యవహారంపై సీరం సీఈవో అదర్ పూనావాలా స్పందించాడు. ఈయూ కొవిషీల్డ్ను అనుమతిస్తుందన్న విశ్వాసం ఉందని అందుకు నెల టైం పట్టొచ్చు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.