బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై  విచక్షణారహితంగా దాడి చేశారు

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు రెచ్చిపోయారు. బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్తపై టీఎంసీ నేతలు విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దారుణ సంఘటన సెప్టెంబర్ 26న చోటు చేసుకోగా... ఆలస్యంగా వెలుగు చూసింది. సెప్టెంబర్ 26న బీజేపీ 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో 24 పరాగణలో రైల్‌రోకో చేస్తున్న మహిళా కార్యకర్తలపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Scroll to load tweet…

నీలిమ దే సర్కార్ అనే మహిళపై టీఎంసీ నేతలు కర్రలతో చావబాదారు. ఈ ఘటన పోలీసుల కళ్లెదుటే చోటు చేసుకుంది. మళ్లీ నిమిషాల వ్యవధిలోనే మీడియా వద్ద మాట్లాడుతున్న నీలిమపై మరోసారి దాడి చేశారు టీఎంసీ నేతలు. ఈ వరుస ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.