భర్తలకు విడాకులు: పెళ్లి చేసుకొన్న ఇద్దరు యువతులు
ఆరేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు వివాహం చేసుకొన్న మ:హిళలు భర్తలకు విడాకులిచ్చి పెళ్లి చేసుకొన్నారు
లక్నో: ఆరేళ్లుగా ప్రేమించుకొన్న ఇద్దరు వివాహం చేసుకొన్న మ:హిళలు భర్తలకు విడాకులిచ్చి పెళ్లి చేసుకొన్నారు. అయితే వీరిద్దరి వివాహన్ని చట్టబద్దం చేసేందుకు రిజిష్ట్రార్ మాత్రం అంగీకరించలేదు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బుందేల్ఖండ్ రాష్ట్రంలోని హమీర్పూర్కు చెందిన 24, 29 ఏళ్ల వయస్సున్న ఇద్దరు యువతులు ఆరేళ్ల క్రితం తమ కాలేజీలో మొదటిసారి పరిచయమయ్యారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబసభ్యులు యువతులను కాలేజీ మాన్పించి పెళ్లి చేశారు.
చదువు మధ్యలోనే మాన్పించి పెళ్లి చేయడంతో ఒకరిని విడిచి మరోకరం ఉండలేకపోతున్నామని ఆ యువతులు చెబుతున్నారు. అయితే తమ ప్రేమను కొనసాగించేందుకు వీలుగా ఇద్దరూ కూడ తమ భర్తలకు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఈ మేరకు ఇద్దరూ కూడ తమ భర్తలకు విడాకులు ఇచ్చారు. గత ఏడాడి డిసెంబర్ 29వ తేదీన ఈ ఇద్దరు యువతులు పెళ్లి చేసుకొన్నారు. అంతేకాదు ఈ వివాహన్ని చట్టబద్దం చేసుకోవాలని ప్రయత్నించారు. కానీ, ఈ వివాహన్ని రిజిస్టర్ చేయడానికి రిజిష్ట్రార్ మాత్రం అంగీకరించలేదు.
ఈ వివాహన్ని చట్టబద్దం చేయాలని యువతుల తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు.స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.