Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతోంది. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురావడానికి భారత్.. ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్న భారత విద్యార్థులు మాట్లాడుతూ.. ఇంటికి తిరిగి వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నామనీ, భారతీయులమైనందుకు గర్వంగా ఉందనీ, ప్రభుత్వం తమ రక్షణ కోసం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
Russia Ukraine Crisis: ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. రష్యా మరింత దూకుడుగా ప్రదర్శిస్తుండటంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే, అక్కడ చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకురావడానికి భారత్.. ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ లో స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉన్న భారత విద్యార్థులు మాట్లాడుతూ.. ఇంటికి తిరిగి వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నాననీ, భారతీయులమైనందుకు గర్వంగా ఉందనీ, ప్రభుత్వం తమ రక్షణ కోసం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని అన్నారు.
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు ప్రత్యేక విమానాల్లో కోసిస్, స్లోవేకియా మీదుగా స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారిలో ఒక విద్యార్థి మాట్లాడుతూ.. "మేము ఇంటికి వెళ్ళడం చాలా బాగుంది, రాయబార కార్యాలయం మా కోసం చాలా చేసింది, వారు మా భోజనం-వసతి ఏర్పాట్లు చేసారు" అని చెప్పింది.
అలాగే, ఆకాంక్ష అనే మరో భారతీయ విద్యార్థి మాట్లాడుతూ.. "నేను ఇంటికి తిరిగి వెళ్లడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. చివరకు, అంతా అయిపోయింది & అందరూ సురక్షితంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను" అని చెప్పింది. "నేను నా కుటుంబాన్ని కలవడానికి సంతోషిస్తున్నాను. నేను భారతీయురాలు అయినందుకు గర్వపడుతున్నాను. ఎంబసీ అధికారులు.. వ్యక్తులు & ఇతరులు చాలా సహాయకారిగా ఉన్నారు" అని మరో విద్యార్థి జాన్సీ చెప్పింది.
కాగా, ఉక్రెయిన్ పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తీసుకురావడానికి ఆపరేషన్ గంగాను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ప్రత్యేక విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తున్నది. భారతీయ పౌరుల రక్షణను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. అక్కడ చిక్కుకుపోయిన భారత పౌరులను స్వదేశానికి తీసుకురావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దించింది. ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు చేపట్టిన ఆపరేషన్ గంగలో భాగంగా మరో రెండు విమానాలు దేశరాజధాని న్యూఢిల్లీ చేరుకున్నాయి. 420 మందితో హంగరీలోని బుడాపెస్ట్, రొమేనియాలోని బుకారెస్ట్ నుంచి వైమానిక దళానికి చెందిన రెండు సీ-17 విమానాలు (C-17 aircrafts) ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్బేస్లో దిగాయి. స్వదేశానికి తిరిగివచ్చిన విద్యార్థులకు కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు.
