Asianet News TeluguAsianet News Telugu

విడిపోయినా.. భరణం ఇవ్వాల్సిందే.. : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

భార్యాభర్తలు విడిపోయిన తరువాత కూడా ఆ భర్త.. భార్య, పిల్లల పోషణకు మెయింటనెన్స్ ఇవ్వాలంటూ అలహాబాద్ హైకోర్టు ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. భార్య, పిల్లల్ని.. కుటుంబాన్ని పోషించడం ఓ వ్యక్తి చట్టపరమైన, నైతిక, సామాజిక బాధ్యత, నిబద్ధత అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

Husband should give maintenance allowance to wife and kids even after separation: Allahabad High Court - bsb
Author
Hyderabad, First Published Nov 4, 2020, 1:21 PM IST

భార్యాభర్తలు విడిపోయిన తరువాత కూడా ఆ భర్త.. భార్య, పిల్లల పోషణకు మెయింటనెన్స్ ఇవ్వాలంటూ అలహాబాద్ హైకోర్టు ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. భార్య, పిల్లల్ని.. కుటుంబాన్ని పోషించడం ఓ వ్యక్తి చట్టపరమైన, నైతిక, సామాజిక బాధ్యత, నిబద్ధత అని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

ఝాన్సీ ఫ్యామిలీ కోర్టులో దాఖలైన ఓ పిటిషన్ లో తీర్పును ఇస్తూ పై విధంగా వ్యాఖ్యానించింది. భర్త నుండి విడిపోయి తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఓ భార్యకు భర్త భరణం ఇవ్వడానికి నిరాకరించాడు. దీనిమీద ఆమె ఝాన్సీ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. 

ఝాన్సీ ఫ్యామిలీ కోర్టు నుండి హై కోర్టుకు చేరుకున్న ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. భారతీయ సమాజంలో వివాహవ్యవస్థకు ముఖ్యమైన స్థానం ఉంది. పెళ్లైన తరువాత తమ కూతురు అత్తవారింట్లో ప్రేమను పొందాలని ప్రతీ తల్లీదండ్రి ఆశిస్తారు. 

కానీ పెళ్లైన తరువాత ఆడపిల్ల అత్తవారింట్లో వేధింపులకు గురవుతోంది. దీంతో తల్లిదండ్రుల కల చెదిరిపోతుంది, వారు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. అన్నీ వదులుకుని భర్త వెంట వచ్చిన భార్యను బాగా చూసుకోవడం భర్త నైతిక, చట్టపరమైన బాధ్యత అని తెలిపింది. 

అంతేకాదు భార్య, కూతురు పోషణ నిమిత్తం భర్త ప్రతి నెలా రూ .3500 చెల్లించాలని ఆదేశించింది. ఝాన్సీ ఫ్యామిలీ కోర్టు ఆదేశాన్ని హైకోర్టు ధృవీకరించింది. కుటుంబ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ అశ్వని యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సౌరభ్ శ్యామ్ శంషేరి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. 

అశ్వని యాదవ్ 29 సెప్టెంబర్ 2015 న జ్యోతి యాదవ్‌ను వివాహం చేసుకున్నారు. వారి వివాహం కోసం మొత్తం రూ .15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయితే,  ఆ తరువాత కట్నం కోసం తన అత్తగారు వేధింపులకు పాల్పడ్డారని జ్యోతి ఆరోపించింది. జనవరి 28, 2019 న జ్యోతి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది. జ్యోతి కుటుంబం కారు ఇవ్వాలన్న డిమాండ్‌పై ఆమె అత్తమామలు ఇప్పటికీ మొండిగా ఉన్నారు. జ్యోతి తన అత్తమామలపై సెక్షన్ 125 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద లీగల్ దావా వేశారు. ఝాన్సీ ఫ్యామిలీ కోర్టు తన భర్త అశ్వానీకి భార్య జ్యోతికి నెలవారీ భత్యంగా రూ .2500, కుమార్తెకు రూ .1000 ఇవ్వాలని ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios