Asianet News TeluguAsianet News Telugu

గొడవతో ఉన్మాదిగా మారి.. డంబెల్ తో భార్య తలను నుజ్జునుజ్జు చేసి, చంపిన భర్త..

కుటుంబకలహాలతో ఓ భర్త ఉన్మాదిగా మారాడు. డంబెల్ తో భార్య తల మీద కొట్టి హతమార్చాడు. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది.  

husband killed wife over family disputes in karnataka  - bsb
Author
First Published Feb 3, 2023, 11:15 AM IST

కర్ణాటక : కుటుంబకలహాలు, వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చుపెడుతున్నాయి. కలకలం కలిసి ఉండాల్సిన దంపతుల్ని బద్ద శత్రువులుగా మారుస్తున్నాయి. కృష్ణరాజపురంలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ భర్త భార్యను అతి కిరాతకంగా డంబెల్ తో కొట్టి హత్య చేశాడు. గురువారం కృష్ణరాజపురం పరిధిలోని రామ్మూర్తినగరలోని హొయ్సళ స్ట్రీట్ లో జరిగింది. భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ భార్య పేరు లిడియా(44).

భార్యను అతి కిరాతకంగా చంపిన ఆ భర్త పేరు మోరిస్. 15యేళ్ల కిందట వీరిద్దరికీ వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు కొడులు సంతానం. మోరిస్ ప్రైవేట్ ఉద్యోగి. గురువారం ఉదయం పిల్లలు ముగ్గురూ స్కూలుకు వెళ్లారు. ఆ తరువాత ఏదో విషయంగా భార్యభర్తల మధ్య వివాదం చెలరేగింది. అది చిలికి చిలికి గాలివాన కావడంతో మోరిస్ ఉన్మాదిగా మారాడు.

ఇనుప డంబెల్ తీసుకుని లిడియా తల మీద గట్టిగా కొట్టాడు. దీంతో ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. దీంతో ఆమె తల నుజ్జు నుజ్జు అయ్యింది. రక్తపు మడుగులో శవంగా పడిపోయింది. వీరి గొడవ, ఆ తరువాత ఆమె అరుపులతో చుట్టుపక్కలవారు అలెర్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రామ్మూర్తినగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఎఫ్బీ లైవ్ లో ఆత్మహత్యాయత్నం.. 15 ని.ల్లోనే కనిపెట్టి, కాపాడిన పోలీసులు.. ఎలాగంటే..

హత్య మీద కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి.. దర్యాప్తు ప్రారంభించారు. తల్లిని తండ్రే చంపడం.. ఆమె దారుణంగా చనిపోవడం.. తండ్రి జైలు పాలు కావడంతో పిల్లలు ముగ్గురూ అనాథలుగా మారిపోయారు. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో ఓ వివాహిత భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. కనిపించకుండాపోయిన ఓ వ్యక్తి.. ఆ  తర్వాత అతను హత్యకు గురయ్యాడని తేలింది. ఈ ఘటన ఏలూరులో సంచలనం సృష్టించింది. రాయపాటి రాటాలు అలియాస్ కాశి (36) అనే వ్యక్తి  జనవరి 3వ తేదీ కనిపించకుండా పోయాడు. ముసునూరు మండలంలోని యల్లాపురానికి చెందిన కాశి ఆరోజు తన వ్యాన్ లో ఇసుకలోడు తీసుకుని బయలుదేరాడు.  

రమణక్కపేటలో  ఇసుకను అమ్ముకుని వస్తానని చెప్పాడు. అయితే అలా వెళ్ళిన వ్యక్తి తెల్లారిన తర్వాత కూడా ఇంటికి తిరిగి రాలేదు.  దీంతో కాశీ తండ్రి సత్యనారాయణ ముసునూరు పోలీస్ స్టేషన్లో కొడుకు అదృశ్యం మీద ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నిందితులు అతడిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. షాకింగ్ విషయం ఏంటంటే నిందితుల్లో మృతుని భార్య ఉండడం. 

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడుతో కలిసి భార్య హత్య చేయించినట్లు తెలిసింది. జనవరి మూడవ తేదీన రమణక్కపేటకు ఇసుకలోడుతో వెళ్లిన కాశి..  రాత్రివేళ తిరిగి వస్తుండగా అతడిని హతమార్చారు. అతని భార్య, ప్రియుడు మరో ముగ్గురుతో కలిసి అతని మీద దాడి చేశారు. సూరేపల్లి మామిడి తోటలోకి తీసుకువెళ్లి చంపేశారు. అక్కడి నుంచి అతడి మృతదేహాన్ని లోపూడి అడవిలోకి తీసుకువెళ్లి ఎవరికి తెలియకుండా దహనం చేశారు. 

ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అనుమానంతో మళ్లీ వెళ్లి చూడగా శవం పూర్తిగా కాలలేదని అర్థమయ్యింది. దీంతో  సగం కాలిన ఆ శవాన్ని తమ వ్యాన్లో వేసుకుని యల్లాపురం గ్రామానికి వచ్చారు. ఆ తరువాత గ్రామ సమీపంలోని తమ్మిలేరులో పాతిపెట్టినట్లుగా సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios