Asianet News TeluguAsianet News Telugu

లిక్కర్ బాటిళ్లపై రూ. 10 చొప్పున గోవు పన్ను.. రాష్ట్ర బడ్జెట్‌లో నిర్ణయం.. ఏ పార్టీ ప్రభుత్వమో తెలుసా?

సెక్యులర్ పార్టీగా పేర్కొనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ను సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు ప్రవేశపెడుతూ కీలక ప్రకటన చేశారు. అందులో లిక్కర్ బాటిల్ పై రూ. 10 చొప్పున గోవు సెస్ ఉంటుందని తెలిపారు.
 

himachal pradesh ruling congress party announces cow cess on liquor bottles in budget
Author
First Published Mar 18, 2023, 4:07 PM IST

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లిక్కర్ బాటిల్ పై గోవు పన్ను వేయనున్నట్టు ప్రకటించింది. దాన్ని కౌ సెస్‌గా పేర్కొంది. ప్రతి లిక్కర్ బాటిల్ పై రూ. 10 గోవు పన్ను (cow cess) విధించే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం గమనార్హం. సెక్యులర్ పార్టీ ఆచరణలో ఇలా ఉంటుందన్నమాట అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుక్కు కాంగ్రెస్ ప్రభుత్వ తొలి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 53,413 కోట్ల బడ్జెట్ సమర్పించిన సుఖ్విందర్ సింగ్ సుక్కు 135 నిమిషాలపాటు ప్రసంగించారు. భగవద్గీతలోని శ్లోకాన్ని పఠిస్తూ బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ బడ్జెట్‌లో లిక్కర్ బాటిల్ పై రూ. 10 మేరకు గోవు సెస్‌ను విధించనున్నట్టు తెలిపారు. 

Also Read: మళ్లీ కరోనా పంజా?.. కొత్తగా 841 కేసులు.. నెల క్రితం కొత్త కేసులు 156.. యాక్టివ్ కేసులు 5,389

ఈ గోవు సెస్‌తో రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ. 100 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేశారు. అలాగే, బడ్జెట్‌లో మహిళలకు రూ. 1,500 నెల పింఛన్‌ ప్రకటించారు. ఏడాదికి ఈ స్కీం కింద రూ. 416 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశార. ఈ బడ్జెట్‌లో ఇతర కీలక నిర్ణయాలు ఉన్నప్పటికీ కౌ సెస్ ప్రధానంగా హెడ్ లైన్స్‌లోకి వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios