Rainfall: కోస్తా, దక్షిణ కర్ణాటక, కేరళ, మహే మరియు లక్షద్వీప్లలో రాబోయే ఐదు రోజులలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
Heavy Rains In Assam-Meghalaya: నైరుతి రుతుపవనాల దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రాబోయే రెండు రోజుల్లో అసోం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) "నైరుతి రుతుపవనాలు వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య & తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు.. మిజోరాం, మణిపూర్ మరియు నాగాలాండ్లోని చాలా ప్రాంతాలలోకి మరింత ముందుకు సాగాయి" అని భారత వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం బెంగళూరు, చిక్మగ్లూరు, కార్వార్లను రుతుపవనాలు తాకాయి. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం మీదుగా అరేబియా సముద్రం నుండి రుతుపవనాల పశ్చిమ గాలుల ప్రభావంతో, కోస్తా మరియు దక్షిణ కర్ణాటక, కేరళ, మహే మరియు లక్షద్వీప్లలో మరియు రాబోయే ఐదు రోజులలో చాలా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది.
వచ్చే ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది. వాయువ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. వాతావరణ కార్యాలయం రాజస్థాన్, దక్షిణ పంజాబ్ మరియు దక్షిణ హర్యానాలో రాబోయే రెండు రోజుల్లో హీట్వేవ్ హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది సాధారణ రుతుపవనాల సూచనను వాతావరణ కార్యాలయం సోమవారం మళ్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోని ఈశాన్య ప్రాంతాలు మరియు తీవ్ర నైరుతి ద్వీపకల్పంలో మినహా రుతుపవనాల వర్షాలు దేశవ్యాప్తంగా బాగా విస్తరిస్తాయని తెలిపింది. IMD సాధారణ ప్రారంభ తేదీ జూన్ 1 కంటే మూడు రోజుల ముందుగా మే 29 న కేరళలో రుతుపవనాలు ప్రారంభమవుతాయని ప్రకటించింది.
ఇప్పటికే అసోం, మేఘాలయాలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసి.. వరదలు పోటెత్తాయి. అసోం, మేఘాలయలో శుక్ర, శనివారం (జూన్ 4)న ఆయా ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తుందని అంచనా వేసింది. అసోం-మేఘాలయ సరిహద్దు వెంబడి గౌహతి శివార్లలో జోరాబాత్ వద్ద ఉన్న NH-37తో సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. జోరాబత్ ప్రాంతంలో భారీగా నీటితో నిండిన వీధిలో ఒక కారు దాదాపు పూర్తిగా మునిగిపోయినట్లు కనిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. లేన్కి ఇరువైపులా వరుసలుగా ఉన్న దుకాణాల వరుసలో వర్షపు నీరు దాదాపు లోపలికి చేరడం కూడా కనిపిస్తుంది. రాబోయే ఐదు రోజుల్లో సిక్కిం మరియు ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్తో సహా మొత్తం ఈశాన్య భారతదేశంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
IMD తాజా బులెటిన్ ప్రకారం ఉత్తర కోస్తా ఒడిశా, ఆనుకుని ఉన్న గంగా పశ్చిమ బెంగాల్ మరియు వాయువ్య బంగాళాఖాతంలో తుఫాను ప్రసరణ కారణంగా వాతావరణ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అంతేకాకుండా, బంగాళాఖాతం నుండి ఈశాన్య భారతదేశం వరకు బలమైన నైరుతి గాలులతో పాటు తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి నాగాలాండ్ వరకు తూర్పు-పడమర ద్రోణి కొనసాగుతోంది.
