Punjab rains: భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలు వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాలు రంగంలోకి దిగాయి. ప్ర‌స్తుతం స‌హాయక చ‌ర్య‌లు కొన‌సాగిస్తున్నాయి. ఇప్ప‌టికే చాలా దుకాణాలు, ఇళ్లలోకి నీరు చేరింది. ఇదే స‌మ‌యంలో భాక్రా, పాంగ్ డ్యామ్‌ల నుండి అదనపు నీటిని విడుదల చేయడంతో హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు తెలిపారు. 

Heavy rainfall in punjab: పంజాబ్ లో వ‌ర్ష బీభ‌త్సం కొన‌సాగుతోంది. భారీ వ‌ర్షాలకు తోడు ఎగువ‌న ఉన్న డ్యామ్ ల నుంచి అద‌న‌పు నీటిని విడుద‌ల చేయ‌డంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ముంపున‌కు గుర‌య్యాయి. పంజాబ్‌లోని హోషియార్‌పూర్, గురుదాస్‌పూర్, రూప్‌నగర్ జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్‌ల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, BSFల‌కు చెందిన అనేక బృందాలు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. భాక్రా, పాంగ్ డ్యాంల నుంచి అదనపు నీటిని విడుదల చేయడంతో ఈ మూడు జిల్లాల్లోని పెద్ద ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని అధికారులు తెలిపారు. డ్యామ్‌ల రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో బియాస్, సట్లెజ్ నదుల్లో నీటిమట్టం క్ర‌మంగా పెరిగింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హిమాచల్ ప్రదేశ్ లోని సట్లెజ్ నదిపై ఉన్న భాక్రా ఆనకట్ట, బియాస్ నదిపై ఉన్న పాంగ్ ఆనకట్ట ఆయా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా యంత్రాంగాలు విజ్ఞప్తి చేసినప్పటికీ పంజాబ్ లోని లోతట్టు ప్రాంతాలు, నదుల ఒడ్డున ఉన్న గ్రామాల్లోని పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గురుదాస్‌పూర్ జిల్లా యంత్రాంగం వరద ప్రభావిత గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సెలవులు ప్రకటించగా, రూప్‌నగర్ లోని అధికారులు ఆగస్టు 17-18 తేదీల్లో ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు.

Scroll to load tweet…

పలువురు గ్రామస్థులు నిత్యావసరాలను భుజాలపై మోసుకుంటూ వరద ప్రభావిత ప్రాంతాల గుండా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదే స‌మ‌యంలో ప‌లువురు గ్రామస్థులు తమ ట్రాక్టర్ ట్రాలీలను ఉపయోగించి చిక్కుకుపోయిన ప్రజలను సురక్షితంగా తరలించడానికి, సహాయక సామగ్రిని అందించడానికి ఉపయోగించారు. బాధితుల కోసం జిల్లా యంత్రాంగాలు సహాయ శిబిరాలు, హెల్ప్ లైన్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశాయి. హోషియార్‌పూర్ లో ముకేరియన్, తండా, దయావా, తల్వారాలోని బియాస్ నది ఒడ్డున ఉన్న పొలాలు, లింక్ రోడ్లు స‌హా అనేక గ్రామాలు నీట మునిగాయని అధికారులు తెలిపారు. ముకేరియన్ బ్లాక్ లో హలేర్ జనార్ధన్, మోట్లా, మియానీ మలాహా, కోలియన్, సింబ్లి, మెహతాబ్ పూర్ గ్రామాలు నాలుగైదు అడుగుల నీటిలో మునిగిపోయాయి. ముకేరియన్-గురుదాస్ పూర్ రహదారి నీటమునిగడంతో జిల్లా యంత్రాంగం మంగళవారం సాయంత్రం వాహనాల రాకపోకలకు మూసివేసింది. ట్రాఫిక్ ను పఠాన్ కోట్ మీదుగా గురుదాస్ పూర్ కు మళ్లించారు.

Scroll to load tweet…