New Delhi: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో నిరంతరం సహాయక చర్యలు చేపడుతున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 100 మందికి పైగా చనిపోయారని సమాచారం. చండీగఢ్ సమీపంలో వరద నీటిలో కొట్టుకుపోయిన కారు నుంచి ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీయగా, మొహాలీ సమీపంలో వేగంగా ప్రవహిస్తున్న వాగులో మంగళవారం కనిపించింది. కారులో ఉన్న మూడో వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా నివాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హర్యానాలో వరదల కారణంగా అంబాలా-లుధియానా జాతీయ రహదారితో సహా పలు కీలక రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. యమునా నది నీరు కర్నాల్ లోని 47 గ్రామాలను ముంచెత్తడంతో అధికారులు సైన్యం సాయం కోరారు.
North India-Heavy Rains: ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇప్పటికీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వరదలు పోటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. రుతుపవనాలు, పశ్చిమ అలజడి కారణంగా ఉత్తరాఖండ్ లో మంగళవారం భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు గంగోత్రి యాత్రికులతో సహా ఎనిమిది మంది మృతి చెందారు. వర్షాలతో అతలాకుతలమైన ఉత్తరాదిలో హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వర్షాలకు సంబంధించిన ప్రమాదాలు, కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా మంగళవారం మరో 21 మంది మరణించగా, జూలై 8 నుంచి ఈ ప్రాంతంలో మృతుల సంఖ్య 100కు చేరిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
సట్లెజ్ నదిలో నీటిని విడుదల చేయడంతో ఫజిల్కాలో అలర్ట్ ప్రకటించగా, వరద ప్రభావిత పంజాబ్ లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. యూపీలోని ఆగ్రా, ప్రయాగ్ రాజ్ లలో యమునా, గంగా నదుల వరద ఉద్ధృతి మరింత పెరగడంతో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఉత్తరకాశీ జిల్లా గంగ్నాని వద్ద హైవేపై ఉన్న మినీ బస్సును రాళ్లు, శిథిలాలు ఢీకొన్నాయి, సోమవారం రాత్రి గంగోత్రి పుణ్యక్షేత్రం నుండి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ లోని దేవాస్ కు చెందిన ముగ్గురు యాత్రికులు, హర్యానాకు చెందిన వారి డ్రైవర్ మరణించారు. మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా వారిని రిషికేశ్ లోని ఎయిమ్స్ కు తరలించారు. రుద్రప్రయాగ్ లో ఇదే తరహా ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. డెహ్రాడూన్ శివార్లలోని కల్సిలో కోఠి రోడ్డులో యుటిలిటీ వాహనంపై పెద్ద బండరాయి పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఉత్తరాఖండ్ లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కుమావూన్ ప్రాంతంలో రానున్న 24 గంటల్లో రుతుపవనాలు కొనసాగుతాయని డెహ్రాడూన్ లోని వాతావరణ శాఖ డైరెక్టర్ బిక్రమ్ సింగ్ తెలిపారు. వర్షాల తీవ్రత ఎక్కువగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో మంగళవారం మరో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లాహౌల్, స్పితి జిల్లాల్లో 14,100 అడుగుల ఎత్తులో ఉన్న చందర్తాల్ సరస్సు సమీపంలోని శిబిరాల్లో చిక్కుకున్న సుమారు 300 మందిని తరలించేందుకు ఐఏఎఫ్ హెలికాప్టర్ల సాయం కోరారు. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా కాప్టర్ తిరిగి రావాల్సి వచ్చింది. కాజా నుంచి రెస్క్యూ టీం కుంజుమ్ టాప్ కు చేరుకుందనీ, సరస్సుకు కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉందని అధికారులు తెలిపారు.
కొండచరియలు విరిగిపడిన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని ఐదు రోజుల తర్వాత ట్రాఫిక్ కోసం పునరుద్ధరించినట్లు జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. అమర్ నాథ్ గుహ పుణ్యక్షేత్రానికి 5,500 మంది యాత్రికులతో హైవేపై నిలిచిన వాహనాలను శ్రీనగర్ వైపు వెళ్లేందుకు అనుమతించారు. మైదాన ప్రాంతాల్లో కూడా వాతావరణం క్లియర్ అయింది, కానీ పంజాబ్ వరద పరిస్థితి భయంకరంగా ఉంది. మరో ఇద్దరు వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అనేక ఇళ్లు, వందల ఎకరాల పంట భూములు నీట మునిగిపోయాయి. తాగునీరు సరఫరాకు అంతరాయం కలిగింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్ ఇంకా నిలిచిపోయింది.
చండీగఢ్ సమీపంలో వరద నీటిలో కొట్టుకుపోయిన కారు నుంచి ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీయగా, మొహాలీ సమీపంలో వేగంగా ప్రవహిస్తున్న వాగులో మంగళవారం కనిపించింది. కారులో ఉన్న మూడో వ్యక్తి హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా నివాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. హర్యానాలో వరదల కారణంగా అంబాలా-లుధియానా జాతీయ రహదారితో సహా పలు కీలక రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. యమునా నది నీరు కర్నాల్ లోని 47 గ్రామాలను ముంచెత్తడంతో అధికారులు సైన్యం సాయం కోరారు.
