Heatwave advisory: ఆరోగ్య సౌకర్యాల కోసం నిరంతర విద్యుత్‌ అందేలా  ఏర్పాట్లు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అన్ని ఆరోగ్య కేంద్రాల వద్ద తగినంత తాగునీరు, క్లిష్టమైన ప్రాంతాల్లో శీతలీకరణ ఉపకరణాలను అందుబాటులో ఉంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.  

Center advice to states : మండుతున్న ఎండలు, విద్యుత్ కోతల మధ్య కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఆరోగ్య సౌకర్యాల కోసం నిరంతర విద్యుత్‌ అందేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. అన్ని ఆరోగ్య కేంద్రాల వద్ద తగినంత తాగునీరు, క్లిష్టమైన ప్రాంతాల్లో శీతలీకరణ ఉపకరణాలను అందుబాటులో ఉంచాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ప్రస్తుతం దేశ‌వ్యాప్తంగా ఎండ‌లు మండిపోతున్నాయి. భానుడు భగ‌భ‌గమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో గ‌రిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్ప‌ట‌కే ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల‌కు పైగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదుకావ‌డం ప్ర‌స్తుతం ఎండ‌ల తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది. అయితే, రానున్న రోజుల్లో ఎండ‌ల తీవ్ర‌త మ‌రింత‌గా పెరుగుతుంద‌నీ, దీని కార‌ణంగా ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం కంటే అధికంగా న‌మోద‌వుతాయ‌ని భారత వాతావరణ విభాగం (India Meteorological Department-ఐఎండీ) హెచ్చరించింది. ఉష్ణోగ్ర‌త‌ల పెరుగుద‌ల‌తో పాటు వేడి గాలుల వీచే ప‌రిస్థితులు మ‌రింత‌గా పెరుగుతాయ‌ని తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎండల తీవ్రత పెరగడం, దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మొదలు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పెరిగే అవకాశముందనే అంచనాల నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, వేడిగాలుల మధ్య కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన చర్యలను అమలు చేయాలని కోరుతూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఒక సలహా జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు పంపిన లేఖలోని వివరాల ప్రకారం.. భారత వాతావరణ శాఖ (IMD), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) రాష్ట్రాలతో జారీ చేసిన రోజువారీ హీట్ అలర్ట్‌లు రాబోయే 3-4 రోజులలో హీట్‌వేవ్ సూచనను సూచిస్తున్నాయని ఆరోగ్య కార్యదర్శి తెలియజేశారు. రోజువారీ హీట్ అలర్ట్‌లను జిల్లా స్థాయిలో తక్షణమే అమలు చేయాలని రాష్ట్రాలను కోరారు. రాష్ట్రాలు 'ఉష్ణ సంబంధిత వ్యాధులపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక'పై దృష్టి పెట్టాలని మరియు జిల్లా స్థాయిలో ప్రచారం చేయాలని కోరారు. "వేడి అనారోగ్యాన్ని ముందస్తుగా గుర్తించడం మరియు నిర్వహించడంపై రాష్ట్రాలు ఆరోగ్య సిబ్బందిందరినీ అప్రమత్తంగా ఉంచాలి" అని ఆయన లేఖలో పేర్కొన్నారు. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాలు ఇలా ఉన్నాయి.. 

1. అన్ని ఆరోగ్య కేంద్రాల వద్ద తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. క్లిష్టమైన ప్రాంతాల్లో శీతలీకరణ ఉపకరణాలు నిరంతరం పని చేసేలా చూడాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

2. IV ద్రవాలు (ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్), ఐస్ ప్యాక్‌లు, ORS మరియు అవసరమైన అన్ని వస్తువుల లభ్యతను సిద్ధం చేసి, సమీక్షించాలని ప్రభుత్వం రాష్ట్ర అధికారులను కోరింది.

3. శీతలీకరణ ఉపకరణాలు మరియు ఇండోర్ హీట్‌ని తగ్గించే చర్యలకు నిరంతరాయంగా విద్యుత్‌ను ఏర్పాటు చేయడం ద్వారా విపరీతమైన వేడిని తట్టుకునే శక్తిని పెంచే ఆరోగ్య సౌకర్యాల అవసరాన్ని కేంద్రం నొక్కి చెప్పింది.

4. భారత వాతావరణ శాఖ సోమవారం నుండి ఉరుములు మరియు ధూళి తుఫానులను అంచనా వేసింది, వేడి తరంగాల నుండి ప్రజలకు కొంత ఉపశమనం కలుగుతుందని భావిస్తోంది. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం మే 15 నాటికి రుతుపవనాలు ప్రారంభమవుతాయి. 

5. ఆరోగ్య సౌకర్యాల కోసం నిరంతర విద్యుత్‌ అందేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.