ఢిల్లీలోని 500 సంవత్సరాల నాటి ప్రఖ్యాత శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చేవేయడంతో పంజాబ్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆలయం కూల్చివేతకు నిరసనగా జలంధర్లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి
ఢిల్లీలోని 500 సంవత్సరాల నాటి ప్రఖ్యాత శ్రీ గురు రవిదాస్ ఆలయం, సమాధి కూల్చేవేయడంతో పంజాబ్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆలయం కూల్చివేతకు నిరసనగా జలంధర్లో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.
పరిస్థితి తీవ్రత దృష్ట్యా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్తో సంప్రదింపులు జరుపుతున్నారు. గురు దాస్ రవిదాస్ ఆలయ కూల్చివేతపై తమ అసంతృప్తిని వెల్లడించగా.. సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని ఆయన హామీ ఇచ్చారని బాదల్ ట్వీట్ చేశారు.
చారిత్రక ఆలయ కూల్చేవేతను తీవ్రంగా ఖండిస్తున్నామని బాదల్ పేర్కొన్నారు. పార్టీ ప్రతినిధి బృందం త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ వ్యవహారం తీవ్రతను ఆయన దృష్టికి తీసుకువెళతామని బాదల్ స్పష్టం చేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 13, 2019, 11:29 AM IST