Gujarat Toxic Liquor Deaths: గుజరాత్లో కల్తీ మద్యం విషాదం సృష్టించింది. ఈ ఘటనలో 42 మంది మృతి చెందారు. దీంతో ఈ ఘటనను రాష్ట్ర హోం శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈఘటనకు బాధ్యులుగా బొటాడ్, అహ్మదాబాద్ జిల్లాల పోలీసు సూపరింటెండెంట్లను బదిలీ చేసింది. ఇది కాకుండా మరో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
Gujarat Toxic Liquor Deaths: గుజరాత్లో కల్తీ మద్యం విషాదం సృష్టించింది. బొటాడ్ జిల్లాతో పాటు, అహ్మదాబాద్లోని పలు గ్రామాలల్లో కల్తీ మద్యం సేవించడం వల్ల 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నగుజరాత్ హోంశాఖ.. బొటాడ్ ఎస్పీ కరణ్ రాజ్ వాఘేలా, అహ్మదాబాద్ ఎస్పీ వీరేంద్ర సింగ్ యాదవ్లను బదిలీ చేసినట్టు గుజరాత్ అదనపు ప్రధాన కార్యదర్శి హోం రాజ్కుమార్ తెలిపారు. ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సస్పెన్షన్కు గురయ్యారు.
ఈ కేసులో నిందితుడు జయేష్ 600 లీటర్ల మిథైల్ కలిపిన కల్తీ మద్యాన్ని విక్రయించినట్టు గుర్తించారు. ఒక్కో ప్యాకెట్ను రూ. 20 చొప్పున విక్రయించారనీ, ఇక పలు గ్రామాలకు చెందిన గ్రామస్థులు ఆ ప్యాకెట్లను విక్రయించి సేవించినట్టు తెలిపారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురై 42 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కల్తీ మద్యం అమ్మిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
జూలై 25న బొటాడ్లో కల్తీ మద్యం సేవించి బొటాడ్, పొరుగున ఉన్న అహ్మదాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 42 మంది మరణించారని గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ బుధవారం తెలిపారు. ఒక్క బొటాడ్లోనే ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయారు. భావ్నగర్, బొటాడ్, అహ్మదాబాద్లోని ఆసుపత్రుల్లో కనీసం 97 మంది చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.
కల్తీ మద్యాన్ని నివారించడంలో ఇక బొటాడ్, అహ్మదాబాద్ జిల్లాల ఎస్పీలు పూర్తిగా విఫలమయ్యారని హోంశాఖ పేర్కొన్నది. విషపూరితమైన పదార్థాలతో మద్యాన్ని తయారు చేసి.. అమయకుల ప్రాణాలను తీస్తున్నారని, కల్తీ మద్యం సేవించిన మరో 97 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
మరోవైపు.. నిషేధిత రాష్ట్రం గుజరాత్ లో నాణ్యమైన మద్యాన్ని సమర్థిస్తూ.. గుజరాత్ మాజీ హోంమంత్రి విపుల్ చౌదరి వివాదస్పద ప్రకటన చేశారు. బుధవారం అర్బుదా ప్యానెల్ పటాన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో విపుల్ చౌదరి ఈ ప్రకటన చేశారు. చౌదరి నేతృత్వంలోని అర్బుదా ప్యానెల్ మెహసానా జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ (దూద్సాగర్ డెయిరీ) ఎన్నికల్లో పోటీ చేయనుంది. మద్యాన్ని సమర్ధించిన చౌదరి.. "ఏ కఠినమైన చట్టం 100% నిషేధాన్ని అమలు చేయదు, కాబట్టి చట్ట ప్రయోజనం ఏమిటి? నాణ్యమైన మద్యాన్ని అందించడం మంచిదని చెప్పాడు.
ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ నేత అల్పేష్ ఠాకూర్ కల్తీ మద్యం దుర్ఘటనలో మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి సానుభూతి తెలిపారు. మద్యపాన నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే, పంచాయతీ, కార్పొరేషన్, విధానసభ లేదా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎన్నికల సమయంలో మద్యం పంపిణీని నిలిపివేయాలని ఠాకూర్ వివాదాస్పద ప్రకటన చేశారు. 182 మంది ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుంటే.. చుక్క అక్రమ మద్యం కూడా బజారులో దొరకదు. ఇది కూడా ఒక సాధారణ అభ్యాసంగా ఉండాలని అన్నారు.
