Gujarat election 2022: ప్రతి ఇంటికి నెలకు రూ.30,000 ప్రయోజనాలు.. : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
AAP: అవినీతిని అంతం చేడయం తమ ప్రధాన అంశాల్లో ఒకటిగా ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయన ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి గుజరాత్ లో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు.
Gujarat election 2022: గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాదిలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఓటర్లను తమవైపునకు తిప్పుకోవడానికి హామీలను ప్రకటిస్తున్నాయి. ఎలాగైనా అధికార బీజేపీకి చెక్ పెట్టి గుజరాత్ లో అధికారపీఠం దక్కించుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్) ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్, ఆ పార్టీ ఇతర నాయకులు వరుసగా గుజరాత్ పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం చేస్తూ... ప్రజలకు తమ ఆప్ పాలన విధానాలను గురించి వివరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికారంలోకి వస్తే గుజరాత్లోని ప్రతి ఇంటికీ నెలకు ₹ 30,000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయని కేజ్రీవాల్ తెలిపారు.
ప్రస్తుతం కేజ్రీవాల్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్తో కలిసి మూడు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. పంచమహల్ జిల్లాలోని మోర్వా హడాఫ్లో జరిగిన ర్యాలీలో ఆయన ద్రవ్యోల్బణం సమస్యను లేవనెత్తారు. కుటుంబ సభ్యుల మాదిరిగా ప్రజలకు సహాయం చేస్తానని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్లో జరిగినట్లుగా రాష్ట్రంలో అవినీతిని తమ పార్టీ అంతం చేస్తుందని కూడా కేజ్రీవాల్ అన్నారు. ‘‘దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం గుజరాత్లో ఉంది. నేను మొదట మిమ్మల్ని ద్రవ్యోల్బణం నుండి విముక్తి చేస్తాను. మార్చి 1 తర్వాత విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. నీకోసం మెరుగైన పాలన అందించడానికి కట్టుబడి ఉన్నాం” అని అన్నారు. అలాగే, “మీకు నెలకు ₹ 27,000 విలువైన ప్రయోజనాలను అందిస్తాం. ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక కుటుంబానికి విద్యుత్ బిల్లులు ₹ 3,000, విద్య ఖర్చులపై ₹ 10,000 అందిస్తాం. నిరుద్యోగ యువతకు ₹ 3,000 స్టైఫండ్, మహిళలకు ₹ 1,000 గౌరవ వేతనం అందిస్తాం. ఇవన్నీ కలిపి ప్రతి ఇంటికి నెలకు ₹ 30,000 వరకు ప్రయోజనాలు అందిస్తాం” అని కేజ్రీవాల్ అన్నారు.
అవినీతి ఎమ్మెల్యేలు, మంత్రుల అక్రమ సంపదను కూడా రికవరీ చేస్తామని కేజ్రీవాల్ చెప్పారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక తీర్థయాత్ర ప్యాకేజీని తీసుకువస్తామని చెప్పారు. "130 కోట్ల మంది భారతీయులు కరెన్సీ నోట్లపై హిందు దేవతలైన వినాయకుడు, లక్ష్మీ దేవి చిత్రాలను కోరుకుంటున్నారు" అని కూడా ఆయన అన్నారు. అధికార బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. “ఆప్ కు బీజేపీకి చాలా తేడాలు ఉన్నాయి..వారు ఎక్కువగా ప్రచారంపై ఆధారపడతారు. ఢిల్లీలో 700 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, గుజరాత్లో 38,000 ఉన్నాయి. ఢిల్లీ పాఠశాలల్లో ఈ సంస్కరణలు అని పిలవబడే వాటిని తీసుకురావడానికి ఆప్ ఎనిమిది సంవత్సరాలు పట్టినట్లయితే, గుజరాత్లో ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వారు సమీపంలో మద్యం విక్రయించే మొహల్లా క్లినిక్ల గురించి మాట్లాడుతున్నారు. గుజరాత్లో ప్రకటనలు.. హోర్డింగ్లు పెట్టడానికి పంజాబ్లోని పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించకుండా, వారు పంజాబ్లో ఉపయోగించాలి” అని గుజరాత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ అన్నారు.