పీఎఫ్ఐతో సంబంధం కలిగిన మదర్సాను సీల్ చేసిన అధికారులు
Madrasa: ఉగ్రవాద, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకుంటూ ఐదేండ్ల పాటు నిషేధం విధించింది.
Popular Front of India: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు సంబంధించిన మదర్సాను వడోదర పోలీసులు, గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు సీల్ చేశారు. పీఎఫ్ఐతో అనుబంధించబడిన ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC)తో అనుసంధానించబడిన మదర్సాను కేంద్రం బుధవారం నిషేధించింది. కాగా, ఉగ్రవాద, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), దాని అనుబంధ సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకుంటూ ఐదేండ్ల పాటు నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు చాలా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. పీఎఫ్ఐ కార్యాలయాలు, దీనితో సంబంధం కలిగిన వ్యక్తుల ఇండ్ల నుంచి కీలక పత్రాలు, దేశ వ్యతిరేక చర్యలకు సంబంధించి ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, వందలాది మంది పీఎఫ్ఐ కార్యకర్తలను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక తాజాగా వడోదర లోని పీఎఫ్ఐతో సంబంధం కలిగిన మదర్సాను వడోదర పోలీసులు, గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు సీల్ చేశారు. "మేము AIIC సమావేశం జరిగిన మదర్సాలో సోదాలు నిర్వహించాము. దానిని సీలు చేసాము. దాని ధర్మకర్తలు, సంబంధికులను ప్రశ్నిస్తున్నాము" అని అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ACP-క్రైమ్) చెప్పారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం-1967 ప్రకారం కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), దాని సహచరులు-అనుబంధ సంస్థలను చట్టవిరుద్ధమైన సంఘంగా ఐదేళ్ల పాటు నిషేధించింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) మంగళవారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా "పీఎఫ్ఐ, దాని అసోసియేట్లు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్లను తక్షణమే చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది" అని ప్రకటించింది. పీఎఫ్ఐతో పాటు రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF)తో సహా దాని సంబంధ సంస్థలపై కూడా నిషేధం విధించబడింది. క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (NCHRO), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ లను చట్టవిరుద్ధమైన సంఘాల జాబితాలోకి వెళ్లాయి.
దేశ సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినందుకు, ప్రజా శాంతి, మత సామరస్యానికి భంగం కలిగించే అవకాశం ఉన్న పీఎఫ్ఐ-దాని సహచరులు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్లపై నిషేధం విధించినట్లు నోటిఫికేషన్ స్పష్టంగా పేర్కొంది. ఆయా సంస్థలు దేశంలో తీవ్రవాదానికి మద్దతు ఇస్తున్న విషయాలను ప్రస్తావించింది. “చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్ 3లోని సబ్-సెక్షన్ (1) ద్వారా అందించబడిన అధికారాల అమలులో (37 ఆఫ్ 1967), కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI), రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF)తో సహా దాని సహచరులు లేదా అనుబంధ సంస్థలు లేదా ఫ్రంట్లను నిషేధ సంస్థలుగా ప్రకటించింది. క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (సిఎఫ్ఐ), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (ఎఐఐసి), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (ఎన్సిహెచ్ఆర్ఓ), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్, ఎంపవర్ ఇండియా ఫౌండేషన్, రిహాబ్ ఫౌండేషన్ లు ట్టవిరుద్ధమైన సంఘాలు' అని నోటిఫికేషన్ పేర్కొంది.