పెరుగుతున్న ఉగ్రకదలికలు.. జమ్మూ అంతర్జాతీయ సరిహద్దు, సాంబా జిల్లాలో కర్ఫ్యూ విధింపు
Samba District: ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు, సాంబా జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అలాగే, ఉగ్రకదలికలు పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు సంబంధిత భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి.
Jammu Kashmir - Curfew: గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని భద్రతా బలగాల రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో జమ్మూకాశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు, సాంబా జిల్లాలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అలాగే, ఉగ్రకదలికలు పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు సంబంధిత భద్రతా వర్గాలు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులో రాత్రిపూట కర్ఫ్యూ విధించినట్లు అధికారులు బుధవారం సమాచారం అందించారు. సాంబ జిల్లా కమీషనర్ అనురాధ గుప్తా ఆదేశాల మేరకు, అంతర్జాతీయ సరిహద్దు నుండి 1 కిలో మీటర్ పరిధి వరకు ఉన్న ప్రాంతాల్లో రాత్రి 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ వర్తిస్తుంది. "అత్యవసర ప్రయాణ సమయంలో ప్రజలు అనవసరంగా కదలవద్దనీ, పత్రాలను తీసుకెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేయండి" అని డిప్యూటీ ఎస్పీ (జమ్మూకాశ్మీర్ పోలీసు, SOG, J&K) గరు రామ్ భరద్వాజ్ తెలిపారు.
అత్యవసర ప్రయాణ సమయంలో అనవసరంగా కదలవద్దని, డాక్యుమెంట్లు తీసుకెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. సరిహద్దు భద్రతా దళం అధికారులతో సమావేశం తర్వాత సాంబా జిల్లా కమిషనర్ అనురాధ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కొండ ప్రాంతాల్లో భారీ హిమపాతం కారణంగా, అంతర్జాతీయ సరిహద్దులో చొరబాట్లకు అవకాశం పెరుగుతుందనీ, ఈ రోజుల్లో మైదానాల్లో చాలా పొగమంచు ఉందనీ, సరిహద్దు గోడను పర్యవేక్షించడానికి భద్రతా దళాలకు ఈ ఉత్తర్వు చాలా సహాయపడుతుందని గరు రామ్ భరద్వాజ్ అన్నారు. వచ్చే రెండు నెలల పాటు ఈ ఆర్డర్ కొనసాగుతుందని తెలిపారు. ఈ క్రమంలో గ్రామస్తులందరికీ సమాచారం అందించామని వెల్లడించారు. సాంబా జిల్లాలోని 55 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దులో అనేక చిన్న, పెద్ద గ్రామాలు ఉన్నాయి.
"ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా మైదానాలలో చాలా పొగమంచు ఉంది. సరిహద్దులో ఉగ్రవాదుల ఉనికి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో చొరబాటు ప్రయత్నాలు పెరిగే అవకాశం ఉందనే భయాందోళనలు ఉన్నాయి" అని డిప్యూటీ ఎస్పీ గరు రామ్ భరద్వాజ్ తెలిపారు. వాతావరణం లేదా మరే ఇతర సవాళ్లతో సంబంధం లేకుండా అన్ని సమయాల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జవాన్లు సిద్ధంగా ఉన్నారని సరిహద్దు భద్రతా దళ అధికారులు తెలిపారు.
ప్రస్తుత వాతావరణ ప్రతికూల పరిస్థితులు, మరేఇతర సవాళ్లతో సంబంధం లేకుండా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మా జవాన్లు చాలా సిద్ధంగా.. సమర్ధంగా ఉన్నారు. మన జవాన్లు సరిహద్దులో 24 గంటలూ సత్వరమే తమ విధులను నిర్వర్తిస్తున్నారు. సెక్షన్ 144 విధించడం వారికి ఎంతో సహాయం చేస్తుంది. భద్రతా బలగాలు ఉగ్రచర్యలను, చొరబాట్లను అడ్డుకుంటాయి" అని సరిహద్దు భద్రతా దళ అధికారులు తెలిపారు. చొరబాట్లను అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.