ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్ కు గూగుల్ ఘనంగా నివాళి అర్పించింది. ఆయన క్వాంటం సిద్ధాంతానికి సంబంధించిన సూత్రీకరణలను ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు 1924 సంవత్సరంలో ఇదే రోజున మెయిల్ చేశారు. ఈ నేపథ్యంలో గూగుల్ ఆయనను గుర్తుచేసుకుంది.
భారతీయ గణిత, భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్ర నాథ్ బోస్ కు గూగుల్ కళాత్మకంగా డూడుల్ తో నివాళి అర్పించింది. డూడుల్ లో బోస్ ఫొటోను, ఆయన ప్రయోగ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగ ఫొటోను ఉంచారు. 1924లో ఇదే రోజున బోస్ తన క్వాంటం సూత్రీకరణలను ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు పంపించారు. ఆయన దీనిని క్వాంటం మెకానిక్స్ లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు గూగుల్ ఇలా సత్యేంద్ర నాథ్ బోస్ చిత్రాన్ని ప్రదర్శించింది.
సత్యేంద్ర నాథ్ బోస్ 1894 జనవరి 1న కోల్ కతాలో జన్మించారు. ఆయన 1920 ల ప్రారంభంలో క్వాంటం మెకానిక్స్ పై పని చేసి ప్రసిద్ధి చెందాడు. ఆయన ‘బోస్ స్టాటిస్టిక్స్’, ‘బోస్ కండెన్సేట్’ సిద్ధాంతానికి బేస్ ను డెవలప్ చేశారు. బోస్ తండ్రి ఒక అకౌంటెంట్. ఆయన బోస్ కోసం ఒక అంకగణిత సమస్యను రాసి ఇచ్చే వారు. ఇది బోస్ కు గణితం పట్ల ఆసక్తిని రేకెత్తించింది. 15 సంవత్సరాల వయస్సులో బోస్ కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని చదివారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో అప్లైడ్ మ్యాథమెటిక్స్లో మాస్టర్స్ సంపాదించారు. బోస్ తర రెండు డిగ్రీల్లోనూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వడంతో విద్యారంగంలో తన గౌరవప్రదమైన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. 1917 చివరి నాటికి బోస్ భౌతికశాస్త్రంపై ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభించారు.
ఒక రోజు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్లాంక్ రేడియేషన్ ఫార్ములాను బోధిస్తున్నప్పుడు ఆయన కణాలను లెక్కించే విధానాన్ని ప్రశ్నించాడు. అదే సమయంలో తన స్వంత సిద్ధాంతాలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు. ప్లాంక్స్ లా అండ్ ది హైపోథెసిస్ ఆఫ్ లైట్ క్వాంటా అనే ఒక నివేదికలో బోస్ తన పరిశోధనలను డాక్యుమెంట్ చేసి దానిని ది ఫిలాసఫికల్ మ్యాగజైన్ అనే ప్రముఖ సైన్స్ జర్నల్ కు పంపారు. అయితే ఆయన పరిశోధన తిరస్కరణకు గురయ్యింది. తరువాత ఆయన తన పరిశోధనను ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు మెయిల్ చేశాడు. బోస్ ఆవిష్కరణ ప్రాముఖ్యతను ఐన్ స్టీన్ నిజంగా గుర్తించారు. బోస్ ప్రాతిపాదిత సూత్రాన్ని విస్తృత శ్రేణి దృగ్విషయాలకు వర్తింపజేశారు.
బోస్ సైద్ధాంతిక పత్రం క్వాంటం సిద్ధాంతంలో అత్యంత ముఖ్యమైన అన్వేషణలలో ఒకటిగా మారింది. భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి భారత ప్రభుత్వం బోస్ కు రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ అందించింది. ఆయనను జాతీయ ప్రొఫెసర్గా కూడా నియమించింది. ఇది భారతదేశంలో పండితులకు ఇచ్చే అత్యున్నత గౌరవం.
వీడియో వైరల్.. గాల్లో పల్టీలు కొడుతూ ట్రాన్స్ ఫార్మర్ కంచెలోకి దూసుకెళ్లిన బైక్..
సత్యేంద్ర నాథ్ బోస్ ఇండియన్ ఫిజికల్ సొసైటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ తో పాటు అనేక శాస్త్రీయ సంస్థలకు అధ్యక్షుడిగా పనిచేశారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు సలహాదారుగా కూడా సేవలందించారు. తరువాత బోస్ రాయల్ సొసైటీకి ఫెలో అయ్యారు. ముఖ్యంగా నేడు ఆయన గణాంకాలకు అనుగుణ౦గా ఉ౦డే ఏ కణాన్నైనా బోసాన్ అని పిలుస్తుంటారు. పార్టికల్ యాక్సిలరేటర్, గాడ్ పార్టికల్ ఆవిష్కరణతో సహా బోస్ నుంచి అనేక శాస్త్రీయ పురోగతులు వచ్చాయి.
