మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయనకు క్యాన్సర్ వ్యాధి బాగా తీవ్రమైనట్లు సీనియర్ మంత్రి విజై సర్దేశాయ్ తెలిపారు.
మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆయనకు క్యాన్సర్ వ్యాధి బాగా తీవ్రమైనట్లు సీనియర్ మంత్రి విజై సర్దేశాయ్ తెలిపారు. అంతేకాకుండా పారికర్ క్లోమగ్రంథికి సంబంధించిన అనారోగ్యంతోనూ బాధపడుతున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం న్యూఢిల్లీలోని ఎయిమ్స్తో పాటు అమెరికాకు కూడా వెళ్లివచ్చారు. తొలుత కాస్త ఉపశమనం లభించినప్పటికీ వ్యాధి పూర్తిగా తగ్గే అవకాశాలు లేవని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో ఆయన పనాజీలో చికిత్స పొందుతూనే సీఎం విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వ్యాధి మరింతగా ముదిరి, తీవ్ర దశకు చేరుకుందని సర్దేశాయ్ మీడియాకు తెలిపారు.
